News February 7, 2025

గుర్రంపోడు: ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

ఉరేసుకొని వ్యక్తం ఆత్మహత్య చేసుకున్న ఘటన గుర్రంపోడు మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధు వివరాల ప్రకారం.. పిట్టలగూడెం గ్రామానికి చెందిన బైరి పవన్(18) డీజె సిస్టం ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి కుటుంబీకులతో కలిసి నిద్రించాడు. కాగా శుక్రవారం లేచి చూసేసరికి ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు కుటుంబీకులు గుర్తించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News February 7, 2025

NLG: ఈనెల 10 నుంచి ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ

image

ఈ నెల 10 నుంచి 21 వరకు 300 మంది ఆపదమిత్ర వాలంటీర్లకు మూడు విడతల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్డీవో శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణలో వాలంటీర్లకు జిల్లాలో భూకంపాలు, కొండచరియలు విరిగినప్పుడు, వరదలు, తుపాను, పిడుగులు పడటం వంటివి జరిగినప్పుడు తీసుకోవాల్సన జాగ్రత్తల గురించి వివరిస్తామన్నారు. ప్రాణనష్టం నివారణ చర్యలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

News February 7, 2025

నల్గొండలో నామినేషన్ వేయనున్న అభ్యర్థులు

image

నామినేషన్లకు 7, 10వ తేదీల్లోనే అవకాశం ఉండటంతో ఈ2 రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన సంఘాల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం TSUTF తరఫు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి, అలాగే TPUS అభ్యర్థి సరోత్తంరెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్లు సమర్పించనున్నారు. కాగా PRTU అభ్యర్థి శ్రీపాల్రెడ్డి 10న నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.

News February 7, 2025

నల్గొండ జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం

image

జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వేసవికి ముందే జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు నమోదు కాగా, మూడు రోజుల్లోనే పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు పెరిగాయి. మరోవైపు గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలలతో పోల్చితే ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు.

error: Content is protected !!