News May 27, 2024
గూగుల్కు వాయిస్ ఇచ్చింది మన కర్నూలు అమ్మాయే..!
గూగుల్ ట్రాన్స్లేట్లో వచ్చే వాయిస్ కర్నూలు జిల్లా అమ్మాయి గ్రీష్మదే. చెన్నైలోని ఓ కళాశాలలో బీటెక్ చదివిన గ్రీష్మకు తన ఫ్రెండ్ ద్వారా వాయిస్ ఓవర్ రంగం గురించి తెలిసింది. తల్లి శశిదేవి డిప్యూటీ కలెక్టర్గా.. తండ్రి జేసీ నాథ్ ప్రిన్సిపల్గా పదవీ విరమణ పొందారు. గ్రీష్మ వాయిస్ ఓవర్లో ప్రైవేటు, ప్రభుత్వ ప్రాజెక్టులకు పనిచేసింది. అంతేకాదు AXIS, HDFC బ్యాంకుల కస్టమర్లకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చింది.
Similar News
News October 10, 2024
భారతదేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది: MP శబరి
టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతిపై నంద్యాల MP డా.బైరెడ్డి శబరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రతన్ టాటా దేశానికి అందించిన సేవలు ఎనలేనివి. నైతిక వ్యాపార పద్ధతుల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారతదేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది’ అని ట్వీట్ పేర్కొన్నారు.
News October 10, 2024
KNL: బన్నీ ఉత్సవాలకు బందోబస్తు వివరాలు ఇలా!
కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని దేవరగట్టులో దసరా పురస్కరించుకొని నిర్వహించే బన్నీ ఉత్సవ ఏర్పాట్లకు ఎస్పీ బిందు మాధవ్ పట్టిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈమేరకు పోలీస్ బందోబస్తు వివరాలను ఎస్పీ వివరించారు. DSPలు-7, CIలు-42, SIలు-54, ASI, HCలు-112, PCలు-362, హోంగార్డులు-95 మంది, స్పెషల్ పార్టీ పోలీసులు-50తో పాటుగా 3 ప్లాటూన్ల AR పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించినట్లు వెల్లడించారు.
News October 9, 2024
పతకాలు సాధించిన క్రీడాకారులకు కలెక్టర్ అభినందన
రాజమండ్రిలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన కర్నూలు జిల్లా క్రీడాకారులను కలెక్టర్ రంజిత్ బాషా అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, అథ్లెటిక్స్ కోచ్ కాశీ రావు పాల్గొన్నారు.