News February 4, 2025

గూడూరు: హైవేపై ప్రమాదం..15 మందికి గాయాలు

image

చిల్లకూరు మండలంలోని బూధనం టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సును నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. ఘటనా స్థలానికి చిల్లకూరు పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 2, 2026

ఒక్క ఇన్నింగ్స్‌తో రోహిత్, కోహ్లీ రికార్డులు బ్రేక్!

image

విండీస్‌తో మ్యాచ్‌లో సంజూ శాంసన్ రికార్డులు బద్దలు కొట్టారు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు (16) బాదిన భారత ప్లేయర్‌గా రోహిత్ శర్మ (15) రికార్డ్ బ్రేక్ చేశారు. అలాగే ఛేజింగ్‌లో అత్యధిక రన్స్ (97*) స్కోర్ చేసి విరాట్ కోహ్లీ (82*) రికార్డ్ అధిగమించారు. కోహ్లీ 2016లో AUSపై, 2022లో PAKపై ఈ రన్స్ చేశారు. T20Iల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (3) దక్కిన ఇండియన్ కీపర్‌ కూడా సంజూనే.

News March 2, 2026

సౌదీ సైలెంట్‌గా పావులు కదిపిందా?

image

ఇరాన్‌పై US దాడుల వెనుక సౌదీ అరేబియా ప్రిన్స్ సల్మాన్ హస్తం ఉందని వాషింగ్టన్‌పోస్ట్ కథనం వెల్లడించింది. ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపినా, దాడి చేయమని సల్మానే ట్రంప్‌ను ప్రోత్సహించి ఒప్పించినట్లు పేర్కొంది. షియా సిద్ధాంతాలు, ఇరాన్ ప్రభావం వ్యాపించకూడదని సౌదీ ప్లాన్ చేయగా.. తమ సరిహద్దుల్లో ఇరాన్ పోషిస్తున్న మిలిటెంట్ల బెడద తగ్గించుకోవడం సులువు అవుతుందని ఇజ్రాయెల్ ఇందుకు సహకరించినట్లు తెలుస్తోంది.

News March 2, 2026

చైనా ఆయుధాలు మరోసారి తుస్సు

image

చైనా డిజైన్ చేసిన ఆయుధాలు, డిఫెన్స్ సిస్టమ్స్ మరోసారి ఫెయిలయ్యాయి. వీటిని నమ్ముకునే US, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్‌ ఎదుర్కొనేందుకు ప్రయత్నించి దెబ్బతింది. ఆ దేశం ఇచ్చిన HQ-9B డిఫెన్స్ సిస్టమ్ శత్రువుల మిసైళ్లను ఎదుర్కోలేకపోయింది. కొన్నింటిని అసలు గుర్తించలేకపోయింది. దీంతో ఇరాన్ భారీగా నష్టపోయింది. జనవరిలో వెనిజులా అధ్యక్షుడు మడురో, ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో పాక్ సైతం చైనాను నమ్ముకొని దెబ్బతిన్నాయి.