News February 4, 2025

గూడూరు: హైవేపై ప్రమాదం..15 మందికి గాయాలు

image

చిల్లకూరు మండలంలోని బూధనం టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సును నెల్లూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. ఘటనా స్థలానికి చిల్లకూరు పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 28, 2026

కృష్ణా: అమ్మో 1వ తారీఖా.. దొరికితే ఇక అంతే..!

image

విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం పట్టణాల్లో ట్రాఫిక్ పోలీసులు టార్గెట్ల పేరుతో ఎడాపెడా ఫైన్లు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హెల్మెట్, లైసెన్స్ లేవనే నెపంతో నెలాఖరు వరకు వసూళ్ల పర్వం సాగుతోందని వాహనదారులు వాపోతున్నారు. ఫైన్ డబ్బులు ప్రభుత్వ ఖజానాకే కాకుండా, కొందరు సొంత ఫోన్ పే నంబర్లకు మళ్లించుకుంటున్నారని టాక్. డబ్బులు కట్టకపోతే అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.

News February 28, 2026

సిద్ధవటంలో చిరుత సంచారం

image

సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు.

News February 28, 2026

విజయ్-రష్మిక పెళ్లి.. నగల విలువ ఎంతో తెలుసా?

image

పెళ్లిలో విరోష్ జంట నగలను HYDకు చెందిన ఓ జువెలరీ సంస్థ 10 నెలల పాటు కష్టపడి డిజైన్ చేసింది. రష్మిక వడ్డాణం, మంగళసూత్రం, గాజులు, నెక్లెస్.. ఇలా 11 రకాల నగల బరువు 1.5-2 కేజీలు ఉంటాయని జాతీయ మీడియా తెలిపింది. వాటి విలువ రూ.3-5 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అటు విజయ్ అరకేజీ బరువైన నగలు ధరించగా దాని వాల్యూ రూ.1-2 కోట్లు అని తెలుస్తోంది. విలువైన వజ్రాలు, స్పెషల్ డిజైన్ కారణంగా ధర పెరిగినట్లు సమాచారం.