News April 10, 2025

గృహనిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో గృహనిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. రాయచోటి కలెక్టరేట్‌లో డిఈలు, ఏఈలు, మండల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. పేదలందరికీ సొంతింటి కల సాకారం చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మేరకు అదనపు ఆర్థిక సహాయం కూడా అందిస్తోందన్నారు.

Similar News

News February 20, 2026

కోటి విద్యలకంటే కోరుకొని పొలం దున్నడం మేలు

image

లోకంలో వేల సంఖ్యలో విద్యలు, వృత్తులు ఉన్నాయి. ఎవరు ఏ ఉద్యోగం, పని చేసినా అది ఆహారం కోసమే. మనిషి ఎంత సంపాదించినా, ఎన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించినా ఆకలి తీర్చుకోవడానికి అన్నమే తినాలి. ఆ అన్నాన్ని పండించేది వ్యవసాయం మాత్రమే. కాబట్టి ఇతరుల దగ్గర బానిసలుగా, ఒత్తిడితో ఉద్యోగాలు చేయడం కంటే వ్యవసాయం చేస్తూ కష్టపడి బతకడం మేలని, ఇది మనిషికి మానసిక తృప్తిని, స్వేచ్ఛను ఇస్తుందని ఈ సామెత చెబుతుంది.

News February 20, 2026

సంతోషి మాత ఎవరు?

image

సంతోషీ మాత సంతృప్తికి అధిదేవత. గణపతి, రిద్ధి-సిద్ధిల కుమార్తెగా చెబుతారు. దుర్గమ్మే శాంతమూర్తిగా, కరుణామయిగా అవతరించిన రూపమని అంటారు. అమ్మవారి చేతిలో ఖడ్గం, త్రిశూలం ఉన్నా.. తన భక్తుల పట్ల ఎంతో మృదువుగా, దయతో ఉంటుంది. భక్తుల కష్టాలను స్వీకరించి, వారికి సంతోషాన్ని, ప్రశాంతతను ప్రసాదించడం వల్లే ఆమెకు ‘సంతోషీ మాత’ అనే పేరు వచ్చింది. అమ్మవారిని పూజిస్తే జీవితంలో అసంతృప్తి తొలగి సంతోషం కలుగుతుంది.

News February 20, 2026

ద్రవిడ వర్సిటీకి పెరిగిన గ్రాంట్

image

కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి TTD నుంచి అందుతున్న వార్షిక నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.50 లక్షలు అందుతుండగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని రూ.1 కోటికి పెంచింది. TTD బోర్డు తీర్మానం మేరకు ఈ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతానికి తోడ్పాటు లభించనుంది.