News November 28, 2025
గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల వేట..!

పంచాయతీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల కోసం ప్రధాన పార్టీలు వేట ప్రారంభించాయి. వేములవాడ నియోజకవర్గంలోని 129 GPలకు, సిరిసిల్లలోని 5 మండలాల్లో 85, JGTL జిల్లాలో 3 మండలాల్లో 44 GPలు ఉన్నాయి. అన్ని పంచాయతీలకు తొలి విడతలో పోలింగ్ నిర్వహించనుండడంతో నామినేషన్ల దాఖలుకు రెండు రోజుల గడువే మిగిలింది. రిజర్వేషన్ల వల్ల ఆశావహులకు అవకాశం దక్కకపోవడంతో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు.
Similar News
News November 28, 2025
మదనపల్లె: తగ్గు ముఖం పడుతున్న టమాటా ధరలు

మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. మార్కెట్కు శుక్రవారం 180 మెట్రిక్ టన్నుల పంట వచ్చినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. వాటిలో మొదటి రకం టమాటాలు 10 కిలోలు రూ.480 పలకగా రెండో రకం రూ. 450, మూడో రకం రూ.400 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారన్నారు.
News November 28, 2025
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.
News November 28, 2025
త్వరలో.. ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు!

ఆధార్కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ను ఇంటి నుంచే మార్చుకోవచ్చని UIDAI ప్రకటించింది. ‘Aadhaar’ యాప్ ద్వారా OTPతో పాటు ఫేస్ అథెంటికేషన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సేవ త్వరలో అందుబాటులోకి రానుందని పేర్కొంటూ యాప్ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకూ మొబైల్ నంబర్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లి వేచి చూడాల్సి వచ్చేది. ఇక్కడ క్లిక్ చేసి యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. SHARE IT


