News February 20, 2026
గొంప: విద్యుత్ షాక్తో లారీ డ్రైవర్ మృతి

సరుగుడు కర్రల లోడు లారీకి సపోర్టుగా కట్టిన కర్రలకు విద్యుత్ తీగలు తగిలి డ్రైవర్ మృతి చెందిన దుర్ఘటన శుక్రవారం గొంప గ్రామంలో చోటు చేసుకుంది. పెందుర్తిలో నివాసముంటున్న నేపాల్ దేశానికి చెందిన లారీ డ్రైవర్ పారదీప్ గొంప చెట్టువాని చెరువు వద్ద లారీలో సరుగుడు కర్ర లోడు వేసుకున్నారు. సపోర్టుగా ఉంచిన కర్రలకు విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై స్పాట్లోనే చనిపోయాడని ఎస్ఐ రఘువర్మ తెలిపారు.
Similar News
News February 21, 2026
సంజూ బ్యాటింగ్ ప్రాక్టీస్.. ఎల్లుండి జట్టులోకి ఎంట్రీ?

అభిషేక్ వరుస డకౌట్లు, తిలక్ పెద్దగా రాణించకపోవడంతో వీరిలో ఒకరి స్థానంలో సంజూ జట్టులోకి వస్తారని క్రికెట్ సర్కిళ్లో బజ్ నడుస్తోంది. ఆదివారం SAతో జరిగే సూపర్-8 మ్యాచ్లో ఆడతారని క్రీడావర్గాలు అంచనా వేస్తున్నాయి. అహ్మదాబాద్ పిచ్ స్పిన్కు అనుకూలమని, స్పిన్నర్లపై అటాక్ చేసే సంజూను ప్లేయింగ్11లోకి తీసుకుంటారని అంటున్నాయి. అటు ఇవాళ శాంసన్ గంటసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం వీటికి బలం చేకూరుస్తున్నాయి.
News February 20, 2026
ఆర్టీఐ యాక్ట్ కింద భర్త శాలరీ వివరాలను భార్య పొందలేరు: హైకోర్టు

రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. RTI యాక్ట్ కింద భర్త శాలరీ వివరాలను భార్య పొందలేరని స్పష్టం చేసింది. ఈ మేరకు కాంత కుమావత్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ‘ఏ విధమైన ప్రజాప్రయోజనం లేని సందర్భాల్లో సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ఇదొక వ్యక్తిగత అంశం. RTI పరిధిలోకి రాదు. ఆమె విజ్ఞప్తిని తిరస్కరించిన ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తప్పులేదు’ అని న్యాయస్థానం పేర్కొంది.
News February 20, 2026
జగిత్యాలలో ఐపీఆర్పై అవగాహన కార్యక్రమం

జగిత్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మేధో సంపత్తి హక్కుల(IPR)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ MSME ఇన్నోవేటివ్ పథకం కింద ఐపీఆర్ ప్రాముఖ్యత, పేటెంట్లు, ట్రేడ్మార్కుల వినియోగంపై నిపుణులు వివరాలు వెల్లడించారు. MSME పథకాలు, మహిళా వ్యాపారవేత్తలకు లభించే అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, వ్యాపార ఆసక్తిగలవారు పెద్ద సంఖ్యలో పాల్గొని సందేహాలు నివృత్తి చేసుకున్నారు.


