News October 18, 2025

గొల్లప్రోలు: అదృశ్యమైన వ్యక్తి బావిలో శవమై తేలాడు

image

మూడు వారాల క్రితం అదృశ్యమైన వ్యక్తి బావిలో శవమై కనిపించాడు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన ముర్రే రామకృష్ణ (49) సెప్టెంబరు 24వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై అతని భార్య ఎల్లావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామ శివారులోని బావిలో శుక్రవారం రామకృష్ణ మృతదేహాన్ని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 18, 2025

అమెరికాలో మంచిర్యాలకు చెందిన తల్లి, కూతురు మృతి

image

మంచిర్యాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన తల్లి, కూతుర్లు అమెరికాలో మృతి చెందారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాత విగ్నేశ్ సతీమణి రమాదేవి(52), కుమార్తె తేజస్వి(32)ని అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం సమయంలో జరిగిన ప్రమాదంలో ఇరువురు మరణించినట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News October 18, 2025

అఫ్గాన్ ఆడకున్నా సిరీస్‌ కొనసాగుతుంది: PCB

image

పాక్ వేదికగా జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి <<18038169>>తప్పుకుంటున్నట్లు<<>> అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్ షెడ్యూల్ ప్రకారమే (Nov 17-29) కొనసాగుతుందని PCB వెల్లడించింది. అఫ్గాన్ స్థానంలో ఇంకో జట్టును ఆడించేందుకు పలు బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు PCB వర్గాలు తెలిపాయి. పాక్, శ్రీలంకతోపాటు మూడో జట్టు పేరు ఖరారు కాగానే అధికారికంగా వెల్లడిస్తామని చెప్పాయి.

News October 18, 2025

దీపావళి ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ఆఫర్‌లు, ప్రకటనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. కేవలం అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే కొనుగోళ్లు జరపాలని సూచించారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే లింకులను తెరవవద్దని ఎస్పీ కోరారు. ఫేక్ ప్రకటనలు నమ్మి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.