News January 26, 2025
గొల్లప్రోలు: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

గొల్లప్రోలు పట్టణ పరిధి కొత్తపేటకు చెందిన రాజనాల వెంకన్న మద్యానికి బానిసై కొంతకాలంగా పనికి వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. అతని భార్య రాజ్యలక్ష్మి పనికి వెళ్లమని వెంకన్నను నిలదీయగా దీంతో మనస్తాపానికి గురైన వెంకన్న ఇంటి వద్ద ఉన్న చెద పురుగులకు కొట్టే మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Similar News
News March 13, 2025
పెద్దపల్లి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధన: విద్యాశాఖ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధనపై వీడియో కాన్ఫరెన్స్ను విద్యాశాఖ కార్యదర్శి నిర్వహించారు. మార్చి 15 నుంచి జిల్లాలలో ఎంపికచేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఆదేశించారు. 3-5వ తరగతి విద్యార్థులకు సామర్థ్యాల పెంపు లక్ష్యం అన్నారు. VCలో PDPL కలెక్టర్ పాల్గొన్నారు.
News March 13, 2025
IPL: హ్యారీ బ్రూక్పై రెండేళ్ల నిషేధం

ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఐపీఎల్లో రెండేళ్లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతో బ్రూక్ ఐపీఎల్ ఆడే అవకాశం లేదు. 2028 ఐపీఎల్లో మాత్రమే ఆడే ఛాన్స్ ఉంది. కాగా ఇటీవల ఐపీఎల్ 2025 నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ ప్రకటించారు. దీంతో ఐపీఎల్ రూల్ ప్రకారం సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్ల నిషేధం విధిస్తారు.
News March 13, 2025
17, 18న అంగన్వాడీల ధర్నాలు జయప్రదం చేయాలి: సీఐటీయూ

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈనెల 17, 18 తేదీల్లో 48 గంటల పాటు కలెక్టరేట్ ముందు నిర్వహించి ధర్నాలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి కోరారు. సంగారెడ్డిలో ధర్నా కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అంగన్వాడీలు ధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.