News February 10, 2025
గొల్లప్రోలు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

గొల్లప్రోలుకు చెందిన గంపల జెంబు ఈ నెల 3న చేబ్రోలుకు వంట పనినిమిత్తం వెళ్లి తిరిగి రాత్రి సమయంలో వస్తుండగా గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి బైక్ నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో తలకు గాయమైంది. దీంతో అతడిని కాకినాడలో ఓ ప్రైవేట్ హస్పిటల్లో చేర్చారు. అతను చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. దీనిపై గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 19, 2025
ముగిసిన ప్రత్యేక పాలన.. పల్లెలకు కొత్త సారధులు

నల్గొండ జిల్లాలో 22 నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడింది. ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈనెల 22న నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 869 గ్రామ పంచాయతీలకు గాను, మూడు మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాలు కొలువుదీరుతుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది.
News December 19, 2025
జీవితఖైదు వేసే అధికారం సెషన్స్ కోర్టుకు లేదు: సుప్రీం కోర్టు

జీవితఖైదు శిక్ష విధించే అధికారం కేవలం రాజ్యాంగబద్ధ కోర్టులకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించడం, కోర్టులు వేసిన శిక్ష తగ్గించే అధికారాలు సెషన్ కోర్టులకు లేవని జస్టిస్ అహ్సానుద్దిన్ అమానుల్లా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల బెంచ్ చెప్పింది. లైంగిక కోరిక తీర్చడానికి నిరాకరించడంతో మహిళకు నిప్పంటించి చంపేసిన కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది.
News December 19, 2025
తెలంగాణ ఫుట్బాల్ జట్టుకు సిద్దిపేట బిడ్డ

జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీలో తలపడే తెలంగాణ ఫుట్బాల్ జట్టుకు సిద్దిపేట వాసి సాయి యశ్వంత్ ఎంపికయ్యాడు. యశ్వంత్ సిద్దిపేటలోనే ఫుట్బాల్లో ఓనమాలు నేర్చుకుని, ప్రస్తుతం హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నాడు. యశ్వంత్ ప్రతిభను గుర్తించి రాష్ట్ర జట్టులోకి తీసుకోవడంపై టీఎఫ్ఏ సెక్రటరీ ఫాల్గుణ, కోచ్ అక్బర్ నవాబ్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా క్రీడాకారుడు జాతీయ జట్టుకు ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


