News March 7, 2025
గోకవరం: కారు ఢీకొని వ్యక్తి మృతి

గోకవరం, కొత్తపల్లి గ్రామంలో పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం కారు – బైకు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ఉన్న జగ్గంపేట మండలం గోవిందపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఇదే ఘటనలో గాయపడిన మహిళను స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 9, 2025
నెల్లూరులో నలుగురు దేవరపల్లి వాసులు అరెస్టు

రాగితీగలు, BSNLకు చెందిన వస్తువులు చోరీ చేస్తున్న ముఠాను ఎట్టకేలకు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు చిన్న బజార్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఇటీవల జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేయగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ప్రాంతానికి చెందిన రమణయ్య, దుర్గారావు, సింహాద్రి, నరసయ్యను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
News March 9, 2025
తూ.గో: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఏఆర్ ఎస్ఐ మృతి

ఆటో ఢీకొని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజమండ్రిలోని స్వరూప్ నగర్కు చెందిన విశ్రాంత ఏఆర్ SI త్రిమూర్తులు (65) శనివారం మృతిచెందాడు. బొమ్మూరు ఎస్ఐ ప్రియకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆయన స్కూటీపై వెళుతుండగా శ్రీరామ్పురం ఫారెస్టు రోడ్డులో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన త్రిమూర్తులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు.
News March 8, 2025
గోకవరం: మైనర్ బాలిక అపహరణ కేసులో వ్యక్తి అరెస్ట్

మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో గోకవరం(M) రాంపయర్రంపాలెం గ్రామానికి చెందిన రాయుడు శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. రాజమండ్రి కోర్టులో శుక్రవారం హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, ప్రేమ పెళ్లి పేరుతో మైనర్ బాలికను అపహరించినట్లు తేలడంతో పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.