News March 24, 2024

గోదారి జిల్లాల్లో 10 స్థానాల్లో జనసేన.. FINAL

image

రాష్ట్ర వ్యాప్తంగా జనసేన 21 చోట్ల పోటీ చేయనుండగా అందులో ఉభయ గోదావరి జిల్లాల నుంచి 10 అభ్యర్థులను ప్రకటిస్తూ ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది. పి.గన్నవరం టికెట్ మొదట టీడీపీ అభ్యర్థికి కేటాయించినప్పటికీ చివరికి ఆ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లింది. పోలవరం సీటు సైతం చివరివరకు సందిగ్ధత ఉండగా..చివరికి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు అవకాశం వచ్చింది. మొత్తంగా గోదారి జిల్లాలు జనసేనకు కీలకం కానుండగా ఓటరు ఎటువైపో..?

Similar News

News February 10, 2026

ప.గో: ఫైళ్ల నిర్వహణ ఇక ఈ-ఆఫీస్‌ ద్వారానే

image

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత కోసం ఇకపై ప్రతి ఫైలు ఈ-ఆఫీస్‌ ద్వారానే పంపాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులకు నిర్వహించిన గూగుల్ మీట్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ విధిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని, ఉద్యోగులందరూ ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

News February 10, 2026

ప.గో: ట్రంప్ టారిఫ్ తగ్గించినా.. ‘సిండికేట్’ వదలడం లేదు (2/3)

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇటీవల ట్రంప్ ఎగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గించడంతో మేలు జరుగుతుందని రైతులు భావించారు. అయితే సిండికేట్ వ్యాపారుల వల్ల రైతులకు ఫలితం దక్కడం లేదు. మేతలు, విత్తనాల ధరలు పెంచి ట్రేడర్లు లాభాలను కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, సిండికేట్ల దోపిడీ నుంచి విముక్తి కలిగించాలని రైతులు కోరుతున్నారు.

News February 10, 2026

వెట్టి చాకిరీ రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్

image

జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా బాధితులకు విముక్తి కలిగించాలన్నారు. ఈ వ్యవస్థను రూపుమాపి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.