News October 24, 2025
గోదావరిఖని: జాగృతి సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సదానందం

తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గోదావరిఖనికి చెందిన అందె సదానందం నియమితులయ్యారు. తెలంగాణ జాగృతిలో పలు పదవులకు పలువురిని నియమిస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జాగృతి రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అందె సదానందంను నియమించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవితకు సదానందం కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 25, 2025
నితీశ్ కుమార్ దూరం.. కారణం ఏంటంటే?

భారత యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి గాయమైంది. అడిలైడ్లో రెండో వన్డే ఆడుతున్న సమయంలో ఎడమ తొడ కండరాలకు గాయం కాగా నేటి మ్యాచ్ సమయానికి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో ఇవాళ్టి వన్డేకు దూరమయ్యారు. నితీశ్ గాయంపై తమ మెడికల్ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు BCCI వెల్లడించింది. అటు తొలి వన్డేలో చివర్లో సిక్సులతో నితీశ్ విరుచుకుపడ్డారు. బౌలింగ్లో చాలినంత అవకాశం రాలేదు.
News October 25, 2025
HYD: తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపిక

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో 2023 సంవత్సరానికి సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపికైనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఈ నెల 29న నాంపల్లి ప్రాంగణంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని, పురస్కారాల గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామన్నారు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వెలువడ్డ పుస్తకాలను సేకరించి పురస్కారాల ఎంపిక చేశామన్నారు.
News October 25, 2025
హైదరాబాద్ వెదర్ అప్డేట్

నగరంలో ఈరోజు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల పొగమంచుతో కూడిన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 28°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°Cగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.


