News September 13, 2025
గోదావరిఖని: ప్రజా భవన్ను ముట్టడించిన కార్మిక సంఘాల జేఏసీ

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై జేఏసీ నాయకులు, కార్మికులు హైదరాబాద్లోని ప్రజా భవన్ను శుక్రవారం ముట్టడించారు. వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, గుమ్మడి నర్సయ్య నిలిచారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి సమస్యలపై విన్నవించారు. వేతనాలను పెంచాలని, లాభాల వాటా రూ.20 వేలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 13, 2025
ములుగు: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 91 మందికి జరిమానా

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ 91 మందికి ములుగు కోర్టు జరిమానా విధించిందని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం వీరిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 85 మందికి రూ.1,68,000 జరిమానా, ఆరుగురికి రెండు రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.12000 జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనం నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 13, 2025
100 రోజుల్లో మేడారం మాస్టర్ ప్లాన్ పూర్తి: మంత్రులు

మేడారం మాస్టర్ ప్లాన్ పనులు 100 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు. కోయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సమ్మక్క సారలమ్మ గద్దెలను ఆధునికరించాలని మంత్రులు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి సూచించిన మార్పులను వివరించారు.
News September 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.