News July 8, 2025
గోదావరిఖని: రేపు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె

రేపు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగనుంది. కేంద్రం ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు విధానాలను అవలంబిస్తుందని వ్యతిరేకిస్తూ వివిధ సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే RGM పారిశ్రామిక ప్రాంతంలోని భారీ పరిశ్రమలైన SCCL, NTPC, RFCLలకు కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ఇదిలా ఉంటే, సమ్మె వల్ల జరిగే నష్టాన్ని కార్మిక వర్గానికి వివరిస్తూ సమ్మెకు దూరంగా ఉండాలని యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Similar News
News July 9, 2025
ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకు?: KTR

TG: చర్చకు వచ్చే ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని ఆయనే సవాల్ విసిరారు. నేను దాన్ని స్వీకరించి, 72 గంటల నోటీస్ ఇచ్చా. ఇవాళ అందరి సమక్షంలో గంటపాటు వేచి చూసినా ఆయన రాలేదు. ఇంతమాత్రం దానికి సవాల్ విసరడం ఎందుకు రేవంత్ రెడ్డి?’ అని ట్వీట్ చేశారు. దీనికి ‘కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ’ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
News July 9, 2025
ఫీజు రీయింబర్స్మెంట్ స్కీం ఎత్తివేసే కుట్ర: ఆర్.కృష్ణయ్య

కాలేజ్ విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగా ట్రస్ట్ బ్యాంక్ నిధి అనే సరికొత్త ప్రతిపాదన కాలేజీ యాజమాన్యాల ద్వారా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు.
News July 9, 2025
బెట్టిగ్కి దూరంగా ఉండాలి: ఎస్పీ

ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు ఎస్పీ తుషార్ డూడి సూచించారు. కష్టపడి సంపాదించిన డబ్బును జూదంపై ఖర్చు చేయొద్దన్నారు. జిల్లాలో ఎవరైన ఆన్లైన్ గేమ్స్, డ్రగ్స్, బెట్టింగ్స్కు పాల్పడినా లేదా నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారిపై 83338 13228కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.