News September 11, 2025

గోదావరిఖని: సీఐటీయూ బ్యాలెట్‌ ద్వారా అభిప్రాయాల సేకరణ

image

సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు కావాలా.. క్వార్టర్‌ కావాలా అనే విషయంపై అభిప్రాయాలను సేకరించేందుకు CITU-SCEU ఆధ్వర్యంలో ఆర్జీ1 ఏరియాలో గురువారం ఓటింగ్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. ఆర్జీ 1 ఏరియాలోని జీఎం ఆఫీస్‌, ఎస్‌అండ్‌పీసీ, జీడీకే 1, 2, 2ఏ, ఓసీపీ 5, వర్క్‌షాప్‌, ఎక్స్‌ప్లోరేషన్‌, సివిల్‌ విభాగాల్లో ఓటింగ్‌ చేపట్టారు. కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని అభిప్రాయాలను తెలిపారని నాయకులు
చెప్పారు.

Similar News

News September 11, 2025

కృష్ణా: సబ్ జూనియర్ సెపక్ తక్రా క్రీడాకారుల ఎంపిక

image

కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సబ్ జూనియర్ బాల, బాలికల జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీలలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నరేష్ పాల్గొన్నారు.

News September 11, 2025

అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ ప్రజా సమస్యలను తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
➤ కె.కోటపాడు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ
➤ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
➤ అనకాపల్లి బెల్లానికి దేశ వ్యాప్త గుర్తింపు: ఎంపీ రమేశ్
➤ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్
➤ తాళ్లపాలెంలో అభివృద్ధి పనులును ప్రారంభించిన MLA కొణతాల
➤ జగన్‌కు పేరు వస్తుందనే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం

News September 11, 2025

VZM: జిల్లాకి చేరుకున్న 39 మంది యాత్రికులు

image

మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్‌లో చిక్కుపోయిన జిల్లాకు చెందిన యాత్రికుల్లో 39 మంది గురువారం క్షేమంగా చేరుకున్నారు. వీరికి విశాఖ విమానాశ్రయం వద్ద ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, బేబీ నాయన స్వాగతం పలికి వారి యోగక్షేమాలను విచారించారు. తమ స్వస్థలాలు చేరుకునేందుకు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డి.మణికుమార్ ఏర్పాట్లు చేశారు.