News February 26, 2025

గోదావరిఖని: ‘AIFTU రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవంతం’

image

గోదావరిఖనిలో ఇటీవల జరిగిన AIFTU రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు విజయవంతం చేసినందుకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు మాతంగి రాయమల్లు మాట్లాడుతూ.. అన్ని వర్గాల కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు చేస్తామన్నారు. నాయకులు గొల్ల అంజయ్య, రత్నకుమార్, రాములు, పోచమల్లు, రామస్వామి, యాకయ్య, పల్లె లింగయ్య, జనగాం చిన్నయ్య ఉన్నారు.

Similar News

News November 14, 2025

‘మల్లె’ తోటల్లో కొమ్మల కత్తిరింపుతో లాభమేంటి?

image

మల్లె తోటల్లో కొమ్మ కత్తిరింపుల వల్ల మొక్క ఆరోగ్యం మెరుగుపడి, కొత్త కొమ్మలు త్వరగా పెరుగుతాయి. పువ్వు పరిమాణం, నాణ్యత, పువ్వుల దిగుబడి కూడా పెరుగుతుంది. చనిపోయిన, బలహీనమైన, అనారోగ్యకరమైన కొమ్మలను తొలగించడం వల్ల మొక్క మిగిలిన భాగాలకు శక్తి, పోషకాలు అంది మొక్క దృఢంగా పెరుగుతుంది. ప్రతి కొమ్మను నేల నుంచి 6-12 అంగుళాల ఎత్తులో కత్తిరించాలి. ప్రతి సీజన్‌లో 25-30% కొమ్మలను మాత్రమే తొలగించాలి.

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో బీసీ నినాదం పనిచేసిందా..?

image

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ విజయానికి బీసీ నినాదం కూడా ప్రధానంగా పనిచేసిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. BRS అభ్యర్థి మాగంటి సునీత కమ్మ వర్గానికి చెందిన మహిళ కావడం, BJP అభ్యర్థి లంకల దీపక్.. రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కావడం నవీన్ యాదవ్‌కు కలిసొచ్చింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓట్లతో పాటు మిగితా బీసీ ఓటర్లు నవీన్‌కే జై కొట్టారు. దీంతో భారీ మెజార్టీతో గెలిచారని వారు అంటున్నారు.

News November 14, 2025

అనుమతుల్లేని ప్లాట్ల యజమానులకు మరో అవకాశం

image

AP: లే అవుట్ల రెగ్యులరైజేషన్‌ స్కీమ్ గడువును GOVT 2026 JAN 23 వరకు పొడిగించింది. ప్లాట్ల యజమానులు LTP ద్వారా పీనలైజ్, ఇతర ఛార్జీలు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. గడువులోగా దరఖాస్తు చేస్తే ఓపెన్ ప్లేస్ ఛార్జీల్లో 50% రాయితీ ఇస్తారు. ఈ అవకాశం మళ్లీ ఉండకపోవచ్చంటున్నారు. కాగా రెగ్యులర్ కాని PLOTSలో నిర్మాణాలకు అనుమతివ్వరు. నిర్మాణాలున్నా తొలగిస్తారు. రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధిత జాబితాలో చేరుస్తారు.