News March 9, 2025
గోదావరిలో భారీగా పడిపోయిన నీటిమట్టం

జీవనదిగా పేరు గాంచిన పవిత్ర గోదావరి అడుగంటిపోతోంది. మార్చిలోనే ఎండలు మండుతుండడంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. భద్రాచలం వద్ద నది నీటిమట్టం గడిచిన ఐదు రోజులుగా కనిష్ఠంగా 2.6 అడుగులకు పడిపోయింది. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఎగువన కురిసే వానలతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడం పరిపాటి. భద్రాచలానికి ఎగువన నీటి స్టోరేజ్ లేకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడుతోందని భావిస్తున్నారు.
Similar News
News March 10, 2025
నల్గొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఆదివారం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం తమ అభ్యర్థిని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దాసోజు శ్రవణ్ కుమార్కు ఈసారి అవకాశం కల్పించారు. ఆయన ఎంపిక పట్ల పలువురు వర్షం వ్యక్తం చేశారు.
News March 10, 2025
CT: అత్యధిక పరుగులు, వికెట్ల వీరులు

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(263) ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. 4 మ్యాచుల్లో రెండు సెంచరీలు చేశారు. ఇక తర్వాతి స్థానాల్లో భారత ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(243), బెన్ డకెట్(227), జో రూట్(225) ఉన్నారు. అత్యధిక వికెట్ల జాబితాలో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ(10W), వరుణ్ చక్రవర్తి(9), సాంట్నర్(9), షమీ(9), బ్రేస్ వెల్(8) ఉన్నారు.
News March 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 10, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.25 గంటలకు
ఇష: రాత్రి 7.37 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.