News February 28, 2026

గోదావరి నది వెంట ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయాలి: అడ్లూరి

image

గోదావరి నది వెంట ఉన్న ఆలయాలను ఆగమ శాస్త్ర పరంగా అభివృద్ధి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు. గత పుష్కరాలకు భిన్నంగా అభివృద్ధి పనులు చేయాలని, వెహికల్ పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కనురెప్పపాటు కరెంటు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు.

Similar News

News April 14, 2026

మెదక్: రోడ్డు భద్రతపై కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రతిజ్ఞ

image

అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులతో కలిసి ఆమె ప్రతిజ్ఞ చేయించారు. అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ ప్రారంభించారు.

News April 14, 2026

అమర జవాన్‌కు కలెక్టర్ నివాళి

image

గోరంట్ల మండలం తల్లి తండాకు చెందిన అమర జవాన్ మురళి నాయక్ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురళి నాయక్ వంటి వీరులు జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ స్ఫూర్తిని యువత కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2026

గాఢ సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభం

image

స్థూల సేంద్రియ ఎరువుల కంటే నత్రజని, భాస్వరం, పొటాష్‌ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉండి నేలకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తాయి. ఉదాహరణ: కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండి, ఆముదపు పిండి, కానుగ పిండి, పత్తి గింజల పిండి, చేపల పొట్టు, ఎముకల పొడి, కొమ్ముల పొడి, వర్మి కంపోస్టు మొదలైనవి. వీటి కొనుగోలు కాస్త ఖర్చుతో కూడుకున్నదైనా నిపుణుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది.