News July 20, 2024
గోదావరి వరద తీవ్రత పై సీఎం ఆరా..!

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో వరద తీవ్రతపై CM రేవంత్ రెడ్డి జిల్లా అధికారుల నుంచి ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద భారీగా వస్తున్న కారణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. అలాగే పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. కాగా సెలవుల్లో కూడా ఉద్యోగులు విధుల్లో పాల్గొనాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News August 17, 2025
ఖమ్మం జిల్లాలో 24 గంటల్లో 15.6 మి.మీ. వర్షపాతం

ఖమ్మం జిల్లాలో గత 24 గంటల్లో 15.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. తల్లాడలో అత్యధికంగా 6.2 మి.మీ., నెలకొండపల్లిలో 3.6, సింగరేణిలో 2.6, వైరాలో 1.2, కామేపల్లిలో 1.0, ఎన్కూరులో 0.8 మి.మీ. వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని, జిల్లా సగటు వర్షపాతం 0.7 మి.మీ.గా ఉందని అధికారులు పేర్కొన్నారు
News August 17, 2025
ఖమ్మం: తగ్గుముఖం పట్టిన మున్నేరు

మున్నేరుకు వరద ఆదివారం ఉదయం తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటలకు నీటిమట్టం 13 అడుగులకు తగ్గింది. శనివారం రాత్రి గంట గంటకూ పెరుగుతూ 15 అడుగుల వరకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద తగ్గుముఖం పట్టడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అవసరం లేకుండా పోయింది. ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమీక్షించారు.
News August 17, 2025
ఖమ్మంలో రెండు రోజులు పూల వ్యాపారం బంద్

ఖమ్మంలో ఈ నెల 18, 19 తేదీలలో పూల వ్యాపారం పూర్తిగా నిలిచిపోనుంది. ప్రతిరోజు వ్యాపారం చేసే వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి, పండుగల సమయంలో కొత్తగా వ్యాపారం చేసే వారికి ఎవరూ సహకరించవద్దని నగర పూల వ్యాపారస్తుల సంఘం నిర్ణయం తీసుకుంది. పాతవ్యాపారస్తులందరూ భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని సంఘం పిలుపునిచ్చింది. బంద్కు సహకరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.