News November 24, 2025
గోపాలపురం: హామీ నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రి

గోపాలపురం నియోజకవర్గం ఐ.ఎస్.జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన.. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 30 ఎకరాల భూ కేటాయింపు పత్రాలను ఆలయ అధికారులకు అందించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Similar News
News November 24, 2025
KNR: ‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
News November 24, 2025
KNR: ‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
News November 24, 2025
GWL: ప్రజావాణిలో ఎస్పీకి 16 ఫిర్యాదులు వెల్లువ

గద్వాల జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు నేరుగా 16 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో పొలానికి సంబంధించినవి 7, గొడవలకు 2, భర్త హరాస్మెంట్కు 2, ప్లాట్ ఇష్యూ, దొంగతనానికి సంబంధించినవి ఒక్కొక్కటి ఉన్నాయి. బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.


