News March 14, 2025
గోపాలమిత్ర కుటుంబీకులకు లక్ష ఆర్థిక సహాయం

సిద్దిపేట మండలానికి చెందిన గోపాలమిత్ర మార్గడి వెంకట్ రెడ్డి కొద్దిరోజుల క్రితం మృతి చెందాడు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గోపాలమిత్ర సభ్యులు ఈరోజు మృతుడి కుటుంబీకులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గోపాలమిత్ర అధ్యక్షులు పల్లెపాటి అశోక్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, మహిపాల్ రెడ్డి, రామస్వామి, సత్తార్, గౌరీ శంకర్ పాల్గొన్నారు.
Similar News
News March 2, 2026
రాష్ట్రస్థాయి పోటీలకు కూచన్ పల్లి విద్యార్థిని

కూచన్ పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీలకు ఎంపికైనట్లు MEO నాచారం మధుమోహన్ తెలిపారు. రెండు రోజుల క్రితం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కూచన్ పల్లి పాఠశాల నుంచి అభినయ, సాత్విక, సహస్రలు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 9వ తరగతి విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.
News March 1, 2026
మెదక్: రేపు యథావిధిగా ‘ప్రజావాణి’

మెదక్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం లాగే రేపు ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా అధికారులందరూ సమయపాలన పాటిస్తూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
News February 28, 2026
మెదక్: ఇన్ఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్!

మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆమె, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.


