News June 19, 2024

గోపాల్‌పేట: చేపల వల కాళ్లకు చుట్టుకొని వ్యక్తి మృతి

image

చేపల వల కాళ్లకు చుట్టుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన గోపాల్‌పేట మండల పరిధిలోని ఎదుట్ల గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై హరి ప్రసాద్ కథనం ప్రకారం.. కుర్మయ్య (41) అనే వ్యక్తి మంగళవారం కుమారుడు, మరో వ్యక్తితో కలిసి ఊరు పక్కనే ఉన్న బావిలో చేపల వేటకు వెళ్లారని, చేపలు పడ్డాయని బావిలోకి దిగి చూడగా కాళ్లకు వల్ల చుట్టుకొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

Similar News

News January 23, 2026

MBNR: MVSలో ఉద్యోగమేళా..164 మంది ఎంపిక

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఉద్యోగమేళా నిర్వహించారు. ఇందులో 164 మంది విద్యార్థులు 18 కంపెనీలలో ఉద్యోగ అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను ప్రిన్సిపల్ డా.కె. పద్మావతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లేస్ మెంట్ కో ఆర్డినేటర్ సూర్యనారాయణ, అకాడమిక్ కో ఆర్డినేటర్ రవీందర్, టీఎస్ కేసీ మెంటర్ తేజస్విని, అధ్యాపకులు పాల్గొన్నారు.

News January 22, 2026

MBNR: సంక్రాంతి ఆదాయంలో ఆర్టీసీ రికార్డు.. రాష్ట్రంలోనే టాప్.!

image

సంక్రాంతి పండుగ వేళ MBNR ఆర్టీసీ రీజియన్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 794 ప్రత్యేక బస్సులతో 39.20 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేసి ₹22.70 కోట్ల ఆదాయం సాధించినట్లు RM సంతోష్ కుమార్ తెలిపారు. 109% ఆక్యూపెన్సీ రేషియోతో తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. సుమారు 34.48 లక్షల కి.మీటర్లు బస్సులు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు.

News January 22, 2026

పాలమూరు కార్పొరేటర్‌కు ఫుల్ డిమాండ్

image

పాలమూరు కార్పొరేషన్​లో కార్పొరేటర్​ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి డివిజన్​ నుంచి ఒక్కోపార్టీ తరఫున ఐదారుగురు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. మరికొన్ని డివిజన్లలో 10 మందికిపై గానే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా డివిజన్లలో క్యాండిడేట్ల ఎంపిక ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్​గా మారింది. కాంగ్రెస్ 373 మంది, BJP నుంచి 250 మంది దరఖాస్తు చేసుకోగా, BRS నుంచి 446 మంది దరఖాస్తు చేసుకున్నారు.