News July 3, 2024

గోల్కొండ దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్

image

చారిత్రాత్మక గోల్కొండ కోట శ్రీజగదాంబిక మహంకాళి దేవాలయ ఛైర్మన్‌గా అరవింద్ మహేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ 14 మంది సభ్యులతో కూడిన బోనాల ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసి ఉత్తర్వులను జారీ చేశారు. సభ్యులందరూ అరవింద్ మహేశ్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోనాల ఉత్సవాల కమిటీ సభ్యులుగా పలువురు నియమితులయ్యారు.

Similar News

News July 5, 2024

గాంధీనగర్: ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

image

తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నాగరాజు రెడ్డి కథనం ప్రకారం.. న్యూ బోయిగూడకు చెందిన అబ్దుల్ రజాక్ కూతురు(13) ఇటీవల బన్సీలాల్ పేట్‌కు వెళ్లి స్నేహితులతో కలిసి ఆడుకొని వచ్చింది. అంతదూరం వెళ్లి రావడంపై తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 5, 2024

HYD: బస్సులో మహిళ ప్రసవం.. అభినందించిన ఎండీ సజ్జనార్

image

ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సులో శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. డ్రైవర్, కండక్టర్ సరోజతో పాటు మహిళా ప్రయాణికులను అభినందించారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవాస్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండడం అభినందనీయమన్నారు.

News July 5, 2024

WOW.. HYD నగరంలో హెరిటేజ్ అందాలు!

image

HYD నగరం హెరిటేజ్ అందాలకు మారుపేరుగా నిలుస్తుంది. దేశ, విదేశాల నుంచి HYD నగరానికి తరలివస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కోకాపేటలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపుగా 120 మీటర్ల ఎత్తులో ఈ హెరిటేజ్ టవర్ ఉండటం గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు.