News January 31, 2026

గోల్డ్ ట్రేడింగ్.. నిమిషానికి రూ.5.33లక్షల కోట్లు ఆవిరి

image

చరిత్రలో తొలిసారి నిన్న గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ట్రేడింగ్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఈస్ట్రన్ టైమ్ ప్రకారం ఉ.9.30-10.25 గంటల మధ్య గోల్డ్ మార్కెట్ విలువ రూ.294 లక్షల కోట్ల మేర ఆవిరైనట్లు గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ల కామెంటరీ ప్లాట్‌ఫామ్ ది కొబెయిసీ లెటర్ తెలిపింది. అంటే నిమిషానికి రూ.5.33 లక్షల కోట్లు. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలోనూ గోల్డ్ ట్రేడింగ్ ఈ స్థాయిలో ఊగిసలాటకు లోనవ్వలేదని పేర్కొంది.

Similar News

News February 3, 2026

మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

image

మైతేయి, కుకీ జాతుల మధ్య హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపుర్ రాష్ట్రానికి కొత్త CM ఖరారయ్యారు. BJP సీనియర్ నేత, మాజీ స్పీకర్ యుమ్నాం ఖేంచంద్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా ఆ పార్టీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. శాంతి భద్రతల పునరుద్ధరణ, జాతుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడం వంటి సవాళ్లు ఎదుర్కోనున్నారు.

News February 3, 2026

అందుకే ట్రంప్ మొదట అనౌన్స్ చేశారు: గోయల్

image

ట్రేడ్ డీల్ గురించి US అధ్యక్షుడు ట్రంప్ ముందే ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ మంత్రి గోయల్ క్లారిటీ ఇచ్చారు. టారిఫ్స్ తగ్గించినట్లు మొదట అమెరికానే ప్రకటించిందని అందుకే ట్రంప్ మాట్లాడారని వివరించారు. టారిఫ్స్ విధించినప్పుడు ప్రకటన చేసినట్టే ఇప్పుడు కూడా ట్రంప్ చెప్పారని అన్నారు. కాగా ట్రంప్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.

News February 3, 2026

రాహుల్ దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు: గోయల్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రాహుల్ లాంటి నెగటివ్ ఆలోచనలు కలిగిన వ్యక్తులు దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశ పురోగతి గురించి వారికి పట్టింపు లేదన్నారు. రాహుల్ సహా విపక్ష ఎంపీలు పార్లమెంటులో స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించారన్నారు. అందుకే పార్లమెంటులో మాట్లాడాల్సిన విషయం ఇక్కడ చెప్పాల్సి వచ్చిందన్నారు.