News February 22, 2026
గోవా సీఎంను కలిసిన బాపట్ల కలెక్టర్

గోవా పర్యాటక విధానం బాపట్లకు ఆదర్శమని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అన్నారు. మూడు రోజుల అధ్యయన పర్యటన ముగింపు సందర్భంగా బృందం గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ను మర్యాదపూర్వకంగా కలిసింది. తీర ప్రాంత అభివృద్ధిలో పర్యావరణ నిబంధనలు పాటించాలనే సూచనలను ఆయన ఇచ్చారు. గోవాలో పొందిన అనుభవాలను బాపట్ల తీర ప్రాంత అభివృద్ధిలో అమలు చేస్తామని కలెక్టర్ బృందం పేర్కొంది.
Similar News
News February 25, 2026
NRPT: GI గుర్తింపు కోసం అవగాహన

జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలోని ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో బుధవారం భౌగోళిక సూచన (GI) గుర్తింపు కోసం అవగాహన సదస్సు నిర్వహించినట్లు సీఈవో తేజస్ తెలిపారు. నారాయణపేట చీరలకు భౌగోళిక సూచిక సర్టిఫికెట్ లభిస్తే ప్రపంచ వ్యాప్తంగా చీరలకు గుర్తింపు లభిస్తుందని చెప్పారు. జీఐ గుర్తింపుకు సంస్థ తరపున కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు, యజమానులు పాల్గొన్నారు.
News February 25, 2026
నిర్మల్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 6,473

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా మాధ్యమిక విద్యశాఖ అధికారి పరుశురాం తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 6,473 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. వారికి 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షల నిర్వాహనకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు.
News February 25, 2026
రాష్ట్రంలోని పాల కేంద్రాల్లో తనిఖీలు: మంత్రి సత్యకుమార్

AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాల కేంద్రాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఫుడ్ శాంపిల్స్ హైదరాబాద్ పంపిస్తున్నామని, త్వరలోనే విశాఖలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇక శ్రీకాకుళంలో డయేరియా అదుపులోకి వచ్చిందన్నారు. నీటి కలుషితం వల్లే డయేరియా ప్రబలిందని సత్యకుమార్ తెలిపారు.


