News December 23, 2025
గోవిందరాజస్వామి ఆలయంపై 30 విగ్రహాలు తొలగించారు..?

గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై ఉన్న విగ్రహాలను బంగారు తాపడం పనుల నేపథ్యంలో తొలగించారు. అనేక దేవతామూర్తుల విగ్రహాలు నేడు కనిపించడం లేదని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై హై కోర్టులో కూడా తప్పుడు నివేదికలు సమర్పించారని అంటున్నారు. ఇదంతా ఆనాటి అధికారులు, అర్చకులు, జీయర్ స్వాములతో సహా ముఖ్యులు తెలిసే జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News December 23, 2025
వింజమూరు MPP తొలగింపు

వింజమూరు మండల అధ్యక్షుడు ఇనగనూరి మోహన్ రెడ్డిని తొలగిస్తూ ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 31వ తేదీన వింజమూరు మండల కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలో మండలంలోని 12 మంది ఎంపీటీసీలకు గాను 11 మంది సభ్యులు ఎంపీపీపై అవిశ్వాసానికి ఓటు వేశారు. ఈ మేరకు ఎంపీపీని తొలగిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి.
News December 23, 2025
ASF: ఇంటర్ విద్యార్థులకు చివరి అవకాశం

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును రూ.2 వేల అపరాధ రుసుముతో ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రాందాస్ తెలిపారు. విద్యార్థులకు ఇదే చివరి అవకాశమని, ఫీజు చెల్లించని వారు వెంటనే తమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో ఫీజు చెల్లించాలన్నారు.
News December 23, 2025
215 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్(<


