News April 6, 2025
గోవింద పల్లెలో ఫ్యాక్షన్ పడగ!

సిరివెళ్ల మండలంలోని గోవింద పల్లె ఫ్యాక్షన్ హత్యలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ప్రస్తుతం దాడికి గురైన ప్రతాపరెడ్డి సోదరుడు ఇందూరి ప్రభాకర్ రెడ్డి గతంలో సిరివెళ్ల మాజీ ఎంపీపీగా పనిచేశారు. ప్రభాకర్ రెడ్డి అతనితో పాటు ఉన్న శ్రీనివాస్ రెడ్డిని 2017వ సంవత్సరంలో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ప్రభాకర్ రెడ్డి, ప్రతాపరెడ్డిల తండ్రి నారాయణరెడ్డి కూడా 1987వ సంవత్సరంలో దారుణ హత్యకు గురయ్యారు.
Similar News
News February 20, 2026
కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే..

పెళ్లైన తర్వాత కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే అంటున్నారు నిపుణులు. దీనివల్ల బంధం దృఢమవ్వడంతో పాటు బాధ్యతలు తెలుస్తాయంటున్నారు. అలాగే ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తుండటంతో కలిసి గడిపే సమయం తగ్గిపోయింది. అదే విడిగా ఉంటే కాస్త సమయమైనా దొరుకుతుందంటున్నారు. అత్తమామలతో అనుబంధం దృఢమయ్యే దాకా విడిగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు వారితో సమయం గడపాలని సూచిస్తున్నారు.
News February 20, 2026
ఇల్లు తుడిచే నీళ్లలో ఉప్పు ఎందుకు వేయాలి?

ఇల్లు తుడిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు కలిపితే ఇంట్లోని ప్రతికూల తరంగాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. ‘ఉప్పులోని రసాయన గుణాలు సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. వాస్తు పరంగా ఇది ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చి, దారిద్ర్యాన్ని పోగొడుతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వీలైతే ప్రతిరోజు లేదా కనీసం మంగళ, శుక్రవారాల్లో ఇలా చేయాలి. తద్వారా ఇంట్లో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి’ అంటున్నారు.
News February 20, 2026
వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్!

వాట్సాప్ గ్రూప్ చాట్లలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై గ్రూప్లో కొత్తగా చేరిన వారు అంతకుముందు జరిగిన సంభాషణ గురించి తెలుసుకోవచ్చు. అడ్మిన్లు లేదా సభ్యులు గత 25 నుంచి 100 మెసేజ్లను వారికి షేర్ చేయవచ్చు. ఇది పూర్తి సురక్షితమైన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో పనిచేస్తుంది. హిస్టరీ షేర్ చేసినప్పుడు గ్రూప్లోని అందరికీ ఇది తెలుస్తుంది. అడ్మిన్లు ఈ ఫీచర్ను ఎప్పుడైనా నిలిపివేయవచ్చు.


