News February 28, 2025

గౌరారంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

గౌరారం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ టీచర్స్ కాలనీకి చెందిన శ్యామ్ బహదూర్ సింగ్ (41), చందు యాదవ్, సాయి కుమార్ రాయపోల్ నుంచి మేడ్చల్ వెళ్తున్నారు. గౌరారం రాజీవ్ రహదారిపై హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రక్‌ని కారు ఢీ కొట్టింది. శ్యామ్ బహదూర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరికి గాయాలు తగిలాయి.

Similar News

News February 28, 2025

NDPS కేసుల్లో హిస్టరీ సీట్లు తెరవాలి: SP

image

విజయనగరం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో నిందితులకు హిస్టరీ సీట్లు తెరవాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియా కేసులపై దృష్టి సారించాలని సూచించారు.

News February 28, 2025

టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 300 నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును మార్చి 3 వరకు పొడిగించారు. ఇందులో జనరల్ డ్యూటీ 260(మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ అర్హత), డొమిస్టిక్ బ్రాంచ్ 40(టెన్త్ అర్హత) పోస్టులున్నాయి. వయసు 18-22 ఏళ్లు ఉండాలి. ఫిజికల్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు 21,700-69,100 ఉంటుంది.
వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/

News February 28, 2025

కొత్తచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

కొత్తచెరువు మండలం అప్పాలోలపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కమ్మవారిపల్లికి చెందిన చక్రధర్ (24) ఈ ప్రమాదంలో మృతి చెందారు. కొత్తచెరువు నుంచి కమ్మవారిపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో చక్రధర్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు.

error: Content is protected !!