News February 13, 2025
గౌలిదొడ్డి: JEEలో గౌలిదొడ్డి విద్యార్థుల ప్రభంజనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739418455884_15795120-normal-WIFI.webp)
RR జిల్లా గౌలిదొడ్డి గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. 99.03 పర్సంటైల్ సాధించి మణిదీప్ అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చరణ్ తేజ్, తేజస్విని, రామ్చరణ్, శ్రీనివాస్, భాను తేజ, నేహాలత, నిహారిక టాప్ ర్యాంకులు సాధించినట్లు రెసిడెన్షియల్ అధికారులు తెలిపారు. ఒకే పాఠశాల నుంచి ఇంత మంది టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.
Similar News
News February 13, 2025
ఒంగోలు ఆవుకు రూ.41 కోట్లు.. సీఎం స్పందనిదే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738676071103_782-normal-WIFI.webp)
ఒంగోలు జాతి గిత్తలు, ఆవులను రక్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇటీవల బ్రెజిల్లో నిర్వహించిన వేలంలో ఆ జాతికి చెందిన వయాటినా-19 అనే ఆవు <<15364444>>రూ.41 కోట్లు<<>> పలకడం శుభపరిణామమన్నారు. దీనివల్ల రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. ఆ జాతి గిత్తలు ఉన్నతమైనవని, బలానికి ప్రసిద్ధి చెందాయని పేర్కొన్నారు.
News February 13, 2025
NRPT: ఎంపికైన కొబ్బరి పూల కుండీల ప్రాజెక్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739439718164_51771152-normal-WIFI.webp)
పర్యావరణ అనుకూలతకు తోటకు ఉపయోగించే సామాగ్రి, బయో డీగ్రేడబుల్ కొబ్బరి పూల కుండీలను TSWRS బాలుర దామరగిద్ద పాఠశాలకు చెందిన విద్యార్థి శివారెడ్డి తయారు చేశాడు. ఈ ప్రాజెక్టు జపాన్ సకురా ప్రోగ్రాంకు ఎంపికైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన 11వ జాతీయ స్థాయి ప్రదర్శన INSPIR-MANAK పోటీల్లో పాల్గొని ఘనత సాధించినట్లు DEO గోవిందరాజులు తెలిపారు. రాష్ట్రం నుంచి 4 ఎంపికైవ వాటిలో ఇది ఒకటి అన్నారు.
News February 13, 2025
చోరీ చేసింది వీళ్లే: కథలాపూర్ ఎస్ఐ నవీన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739442202229_718-normal-WIFI.webp)
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో బుధవారం వృద్ధురాలి మెడలో నుంచి ఇద్దరు యువతులు బంగారం దొంగిలించిన సంగతి తెలిసిందే. ఈ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీని స్థానిక ఎస్ఐ నవీన్ కుమార్ గురువారం విడుదల చేశారు. అనాథ పిల్లలకు డోనేషన్ ఇవ్వాలంటూ వారు గ్రామాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్నారని, ఈ ఫొటోలో ఉన్న యువతులను ఎవరైనా గుర్తిస్తే తన ఫోన్ నంబర్ 8712656793కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.