News November 19, 2025

గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ భారత్‌కు అప్పగింత

image

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. అధికారులు అతడిని ఇండియాకు తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సిద్దిఖీ కొడుకు జీషన్ US కోర్టులో పిటిషన్ వేయడంతో అన్మోల్‌ను భారత్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.

Similar News

News April 17, 2026

రాష్ట్రంలో కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు

image

TG: రాష్ట్రంలో కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 79 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ద్వారా అదనంగా 416 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 102 డయాలసిస్ సెంటర్లు ఉండగా, వాటిలో 15,600 మంది పేషంట్లు సేవలు పొందుతున్నారు. మరోవైపు 67 పాత సెంటర్లలో వెయిటింగ్ టైమ్ తగ్గించేందుకు కొత్తగా 155 మెషీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News April 17, 2026

5 మ్యాచుల్లో 0 వికెట్లు.. బుమ్రా పేలవ ప్రదర్శన

image

MI స్టార్ బౌలర్ బుమ్రా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తన పదునైన బౌలింగ్‌తో T20 WC గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈ యార్కర్ల కింగ్ IPLలో మాత్రం తేలిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. పైగా పరుగులు భారీగా సమర్పించుకుంటున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై 195 పరుగులు చేసినా ఓడిపోయింది. పరోక్షంగా ఇందుకు బుమ్రా కూడా కారణం. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చారు.

News April 17, 2026

5 మ్యాచుల్లో 0 వికెట్లు.. బుమ్రా పేలవ ప్రదర్శన

image

MI స్టార్ బౌలర్ బుమ్రా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తన పదునైన బౌలింగ్‌తో T20 WC గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈ యార్కర్ల కింగ్ IPLలో మాత్రం తేలిపోతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. పైగా పరుగులు భారీగా సమర్పించుకుంటున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై 195 పరుగులు చేసినా ఓడిపోయింది. పరోక్షంగా ఇందుకు బుమ్రా కూడా కారణం. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చారు.