News March 18, 2026

గ్యాస్ సిలిండర్ల కొరత.. విజయవాడ హోటల్స్‌లో సాంబార్ కట్

image

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విజయవాడలోని పలు హోటల్స్‌లో మెనూ మారిపోయింది. గ్యాస్ సిలిండర్ల లభ్యత తగ్గడంతో టిఫిన్ హోటల్స్ నిర్వాహకులు ఫుడ్ ఐటమ్స్‌తో పాటు అందజేసే సాంబార్ తయారీ నిలిపివేశారు. సాంబార్‌తో పాటు కొన్ని ఐటమ్స్‌ను మెనూ నుంచి తొలగించినట్టు పలు హోటల్స్ నిర్వాహకులు బోర్డులు పెడుతున్నారు.

Similar News

News April 5, 2026

వరంగల్ మార్కెట్ రేపు పున: ప్రారంభం

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News April 5, 2026

ఖానాపూర్: బీజేపీ ఛైర్‌ పర్సన్‌.. బీఆర్ఎస్ వైస్ ఛైర్మన్

image

ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఛైర్మన్ పదవిని బీజేపీ దక్కించుకోగా, వైస్ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్‌కు దక్కింది. ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన అంకం మౌనిక, వైస్ ఛైర్మన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహమ్మద్ షోహెబ్ ఎన్నికయ్యారు. రాజకీయ సమీకరణాల మధ్య సాగిన ఈ ఎన్నిక ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. నూతన పాలకవర్గానికి పలువురు నేతలు అభినందనలు తెలిపారు.

News April 5, 2026

MIకి శుభవార్త.. కోలుకున్న హార్దిక్!

image

అనారోగ్యం కారణంగా DCతో మ్యాచ్‌కు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ కోలుకున్నట్లు సమాచారం. ఎల్లుండి రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆయన ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా KKRపై గెలిచిన ముంబై నిన్న DC చేతిలో ఓడిన విషయం తెలిసిందే.