News September 9, 2025
గ్రీవెన్స్ డే.. బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎస్పీ

జగిత్యాల జిల్లాలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ డే జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగుతుంది. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది అర్జీదారులతో ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని వారిని ఆదేశించారు. ఈ ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.
Similar News
News September 10, 2025
2027 నాటికి ప్రాజెక్టులు పూర్తి: మంత్రి ఉత్తమ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని SLBC, బ్రహ్మణవెల్లంల, డిండి, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నీటి పారుదల అధికారులతో జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. చివరి దశలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని మండలి ఛైర్మన్ గుత్తా కోరారు. జిల్లాకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
News September 10, 2025
అన్నమయ్య: ఒక్కకాల్.. దళారుల పని ఫట్

సెప్టెంబర్ 10వ తేదీ నుంచి టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ.8గా, సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలోకు రూ.7గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం వెల్లడించారు. మార్కెట్లో ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు విక్రయిస్తే, వెంటనే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని రైతులకు సూచించారు. సంప్రదించాల్సిన నంబర్లు 9573990331, 9030315951. ఈ నంబర్లకు కాల్ చేస్తే దళారుల పనిపడతామని కలెక్టర్ అన్నారు.
News September 10, 2025
రైతులు అధైర్య పడకండి.. యూరియా కొరత లేదు: కలెక్టర్

అనంతపురం జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా యూరియాను సక్రమంగా అందిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో వివిధ రైతు సేవా కేంద్రాల్లో 298 మెట్రిక్ టన్నులు, సొసైటీలలో 92, ప్రైవేట్ డీలర్ల వద్ద 448 మెట్రిక్ టన్నులు, హోల్సేల్ డీలర్లు & AP Markfed వద్ద 1069 మెట్రిక్ టన్నులు, రవాణా కింది 519 మెట్రిక్ టన్నులు మొత్తంగా జిల్లాలో 2,426 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.