News March 31, 2025
గ్రూప్-1లో అదరగొట్టిన పాలమూరు బిడ్డలు

ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల ర్యాంకులను టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఇందులో మల్టీజోనల్ ర్యాంకులలో పాలమూరు బిడ్డలు అదరగొట్టారు. కొత్తకోటకు చెందిన పవన్కుమార్కు 10వ ర్యాంకు, మూసాపేట నిజాలపూర్కు చెందిన వెంకటేశ్ ప్రసాద్కు 12వ ర్యాంకు, కల్వకుర్తి పట్టణానికి చెందిన సాహితీకి 45వ ర్యాంకు, పాన్గల్ మం. బుసిరెడ్డిపల్లికి చెందిన సుజతకి 900 మార్కులకు గానూ.. 459 మార్కులు వచ్చాయి.
Similar News
News September 11, 2025
MBNR: పశువుల దొంగల అరెస్టు.. రూ.14.50 లక్షలు స్వాధీనం

MBNR(D) నవాబ్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనాలు చేసిన నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నెల 2న కేసు నమోదు అయిందన్నారు. నవాబ్పేట్ పోలీసులు కన్మన్ కల్వ గ్రామ శివారులో నేడు పెట్రోలింగ్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను, బొలెరో వాహనం అదుపులోకి తీసుకున్నామన్నారు. రూ.14,50,000 విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News September 11, 2025
భారీ వర్షం.. జానంపేటలో అత్యధికం

మహబూబ్నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మూసాపేట మండలంలోని జానంపేటలో అత్యధికంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అడ్డాకులలో 33.5, దేవరకద్రలో 31.5, చిన్నచింతకుంటలో 22.0, మహమ్మదాబాద్లో 11.0, కోయిలకొండలో 4.5, మహబూబ్నగర్ అర్బన్లో 3.5, కౌకుంట్లలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
News September 11, 2025
తెలుగు వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు

ఈ ఎడాదికి గాను పీజీలో చేరెందుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ డైరెక్టర్ డా.బి.రాధ Way2Newsతో తెలిపారు. ఈనెల 19, 20న ఉ.11.00 గం. – సా.4.30 వరకు బాచుపల్లిలో దరఖాస్తులు చేసుకోవాలని, ఆసక్తి గల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, 3 ఫోటోలు, 3 సెట్ జిరాక్స్ పత్రాలతో హాజరు కావాలన్నారు. ప్రవేశ పరీక్ష రాయని వారు రూ.600 డీడీను సమర్పించాలన్నారు.