News March 12, 2025
గ్రూప్ 2లో మెరిసిన ఆసిఫాబాద్ ఆణిముత్యం

కౌటాల మండల వాసి సాయిరాం గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 191 ర్యాంకు సాధించారు. కాగా ఇప్పుడు బెజ్జూరు మండలం మొగవెల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, తోటి మిత్రులు అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో కూడా విజయం సాధించినప్పటికీ దానిని వదులుకున్నట్లు సాయిరాం గౌడ్ తెలిపారు.
Similar News
News February 15, 2026
వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.
News February 15, 2026
హీరో నిఖిల్ వివాదాస్పద పోస్ట్.. ఎవరి గురించి?

హీరో నిఖిల్ నటించిన ‘స్వయంభు’ సినిమా నుంచి ఇటీవల ఎపిక్ టీజర్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టెక్నికల్ సమస్య వల్ల ఈ టీజర్ను యూట్యూబ్లో రీఅప్లోడ్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘యూట్యూబ్ భయ్యా ఎందుకిలా టెక్నికల్ గ్లిచ్ వచ్చేలా చేశావ్.. ఇటీవల రిలీజైన సినిమాల్లాగా మా మూవీలో AI యూజ్ చేయలేదు’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ఎవరిని, ఏ సినిమాను ఉద్దేశించి ఇలా కామెంట్ చేశారనే చర్చ మొదలైంది.
News February 15, 2026
RGM: సీఎంను కలిసిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు

రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. HYDలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను ఆదివారం కాంగ్రెస్ కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్లలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో బాధ్యతాయుతంగా పని చేయాలని, అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. MLA- MS రాజ్ ఠాకూర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


