News March 14, 2025
గ్రూప్-2లో 11వ ర్యాంకర్కు కలెక్టర్ సన్మానం

తెలంగాణ గ్రూప్-2లో రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంక్ సాధించిన మోత్కూర్కు చెందిన గుర్రం సాయి కృష్ణారెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అభినందించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సాయి కృష్ణను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కృషితో ఉన్నత ర్యాంక్ సాధించడం యువతకు ప్రేరణ అని ప్రశంసించారు. కార్యక్రమంలో అధికారులు వీరారెడ్డి, ఏవో జగన్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 11, 2025
మణుగూరులో 4,000 ఉద్యోగాలకు జాబ్ మేళా

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న మణుగూరులో జరగనున్న జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. భద్రాద్రి స్టేడియంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ మేళాకు 100కు పైగా కంపెనీలు హాజరవుతాయని తెలిపారు. ఈ మేళా ద్వారా 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News November 11, 2025
రోడ్లపై గుంతలు లేకుండా చేయండి: చంద్రబాబు

AP: రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా వాహనం నడుపుతున్న వారికి అవగాహన కల్పించాలని, అవసరమైతే వారి మొబైల్స్కి సందేశాలు పంపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు.
News November 11, 2025
సంగారెడ్డి: నేటి నుంచి జిల్లా స్థాయి ఖోఖో పోటీలు

సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లా స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రావ్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులందరూ జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. విద్యార్థులు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.


