News February 22, 2025

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథం: కలెక్టర్ 

image

నెల్లూరులో రేపు(ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని కోరారు. 

Similar News

News February 10, 2026

ఉదయగిరి: ఆధార్ కార్డుపై కీలక అప్డేట్ ?

image

దేశంలో ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోని వారి కార్డులు నిలిపివేసినట్లు ఉదయగిరి ఆధార్ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఎటువంటి అప్డేట్ చేయాలనుకున్న ముందుగా వాటి చెల్లుబాటు స్థితి తప్పనిసరిగా తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. రద్దు చేయబడిన, నిలిపివేయబడిన, చెల్లుబాటు కోల్పోయిన వారు ప్రాథమిక ఆధార్ కేంద్రాలను లేదా 1947 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News February 10, 2026

నెల్లూరులో గీత దాటితే ఫైన్.. జాగ్రత్త!

image

నెల్లూరులో నూతన సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. DKW కళాశాల, KVR పెట్రోల్ జంక్షన్, VRC, కనకమహల్, రామలింగాపురం సహా ఏడు ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ పెట్టారు. వీటి పనితీరును కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ నందన్ పరిశీలించారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే సిగ్నల్ వద్ద ఉన్న కెమెరాల్లో రికార్డు అవుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆ వాహనానికి ఫైన్ వేస్తారు. ఇదంతా మీకు తెలియకుండా జరుగుతుంది.

News February 10, 2026

ఆత్మకూరు: పెళ్లి చేసుకొని బంగారంతో మహిళ పరార్!

image

ఓ మహిళ పెళ్లి చేసుకొని నగలతో పరారైన ఘటన ఇది. బాధితుడి వివరాల మేరకు.. ఆత్మకూరుకు చెందిన మహాలక్ష్మి వివాహమైంది. అతనికి విడాకులు ఇవ్వకుండానే శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన సుబ్బారావును రెండో పెళ్లి చేసుకుంది. ఆయన వద్ద ఉన్న 30 తులాల బంగారం, పత్రాలు తీసుకుని పరారైంది. ఆత్మకూరులో ఆరా తీయగా ఆమె నిత్యం పెళ్లిళ్లతో ఇలా పలువురిని మోసగిస్తున్నట్లు తెలిసిందన్నారు.