News March 15, 2025
గ్రూప్ – 3లో ఉద్యోగం సాధించిన అయిజ యువకుడు

అయిజ తెలుగుపేట కాలనీకి చెందిన దరెన్న, కృష్ణమ్మ దంపతుల కుమారుడు హరికృష్ణ ఇటీవల వెలువడిన గ్రూప్ – 3 ఫలితాల్లో 433వ ర్యాంక్ సాధించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. 2015-16లో బిటెక్ చేసి సాఫ్ట్ వేర్ రంగం వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్ 3 జనరల్ విభాగంలో 433 వ ర్యాంకు సాధించాడు. దీంతో పలువురు హరికృష్ణను అభినందించారు.
Similar News
News December 15, 2025
గజ్వేల్: సబ్బుబిళ్లపై సర్దార్ పటేల్ చిత్రం

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా గజ్వేల్కు చెందిన రామకోటి రామరాజు సబ్బుబిళ్లపై ఆయన చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు అర్పించారు. భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు అయిన రామరాజు మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ స్వాతంత్య్ర సమరయోధుడు, నవ భారత నిర్మాత, ఉక్కు మనిషి, గొప్ప దేశభక్తుడు అని కొనియాడారు.
News December 15, 2025
తిరుమల.. మార్చి నెల టోకెన్ల విడుదల తేదీలివే

⁎ మార్చి నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా DEC 18న 10amకి ఆన్లైన్లో విడుదల, 20వ తేదీ 10am వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు, టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ 12pmలోగా నగదు చెల్లించాలి
⁎ 22న 10amకి కల్యాణోత్సవం, తెప్పోత్సవాల టికెట్లు, 3pmకి వర్చువల్ సేవల కోటా రిలీజ్
⁎ 23న 10amకి అంగప్రదక్షిణ, 11amకి శ్రీవాణి ట్రస్ట్, 3pmకి వృద్ధులు, దివ్యాంగుల కోటా, 24న 10amకి ₹300 టికెట్లు, 3pmకి గదుల కోటా విడుదల
News December 15, 2025
కలెక్టర్ను కలిసిన అన్నవరం ఈవో

అన్నవరం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన వేండ్ర త్రినాధరావు సోమవారం కలెక్టర్ షాన్మోహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రత్నగిరిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని కలెక్టర్ సూచించారు. గతంలో రెండుసార్లు ఈ ఆలయ ఈవోగా పనిచేసిన అనుభవం తనకుందని, భక్తులే దేవుళ్లనే భావనతో ఆలయ అభివృద్ధికి శ్రమిస్తానని త్రినాధరావు కలెక్టర్కు హామీ ఇచ్చారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.


