News February 23, 2026
గ్రేటర్లో కొత్త వెలుగుల జిలుగులు

మూడు ముక్కలైన గ్రేటర్ పాలనలో ఇప్పుడు కొత్త కాంతులు నిండనున్నాయి. EESL తప్పుకోవడంతో వీధి దీపాల నిర్వహణ భారమైనా ప్రభుత్వం పట్టు వదలకుండా CYB, మల్కాజిగిరి, GHMC పరిధిలో ఒకే తరహా వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక జీవో విడుదల కానుంది. ఇకపై నగరం మొత్తం ఒకే రకమైన ప్రకటనల పాలసీ అమల్లోకి రానుంది. డిజిటల్ వెలుగులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సర్కారు అడుగులు వేస్తోంది.
Similar News
News March 1, 2026
OMG.. HYDలో భారీ LIVE FISH

నగర శివారు కీసరలోని గోషాల వద్దగల చెరువులో భారీ చేప జాలరుల వలకు చిక్కింది. ఓ వ్యక్తి ఆదివారం సరదగా అలా చెరువు వద్దకు వెళ్లాడు. 14కేజీల భారీ చేప చిక్కను కిలోల లెక్కన కొనుగోలు చేశాడు. దీంతో కుటుంబమంతా సంతోషం వ్యక్తం చేస్తుంది. పక్కనే గ్రౌండ్లో ఉన్న ప్లేయర్స్, స్థానికులు ఈ చేపను ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మీరెప్పుడైనా ఇంత పెద్ద చేపను లైవ్లో చూశారా?
News March 1, 2026
VZM: ఉదయాన్నే ప్రమాదం.. వ్యక్తి మృతి

రామభద్రపురం మండలం బూసాయవలస(ముచర్ల వలస) గ్రామ సమీపంలో సాయి కృష్ణ ఆగ్రో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇతని వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్లు దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2026
GNT: విషాదం.. పిల్లలకు టిఫిన్ తెచ్చేందుకు వెళ్లి దుర్మరణం

తెనాలిలోని పినపాడు మద్రాస్ రైల్వే గేట్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. కరేటి సురేశ్ (45) తన పిల్లల కోసం టిఫిన్ తెచ్చేందుకు బయటకు వెళ్లి, పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకేసారి రెండు రైళ్లు రావడంతో గందరగోళానికి గురైన సురేశ్ను ఒకటో నెంబర్ ట్రాక్పై వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.


