News May 30, 2024

గ్రేటర్‌లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

image

గ్రేటర్‌లో మొన్నటి వరకు వర్షాలతో చల్లబడిన వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రెండు, మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో పగటి పూటజనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.2, కనిష్ఠం 27.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అటు గాలిలో తేమ 32 % నమోదైనట్లు వెల్లడించారు.

Similar News

News September 29, 2024

BREAKING: రేపు మూసి బాధితుల వద్దకు కేటీఆర్

image

రేపు మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ భవన్‌లో సమావేశం అనంతరం మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌గూడలో పర్యటించనున్నారు. తర్వాత అత్తాపూర్‌లోని కిషన్‌బాగ్ ప్రాంతాల్లోని మూసీ ప్రాజెక్ట్‌తో నష్టపోతున్న ప్రజలను కలవనున్నారు.

News September 29, 2024

HYD: మూసీ భాదితులను కన్న బిడ్డల్లా చూసుకుంటాం: మంత్రి

image

మూసి నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లను కాపాడే భాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సొంత నివాసం లేని వారికి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, పేదలని కన్నబిడ్డల్లాగా చూసుకుంటామని అన్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను బెస్ట్ సిటీగా నిర్మిస్తామని తెలిపారు.

News September 29, 2024

HYD: పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత..!

image

HYDలోని 691 ప్రభుత్వ పాఠశాలలో 1,12,650 మంది విద్యార్థులు ఉండగా.. వీరికి 4,265 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. RR, MDCL, VKB జిల్లాల పరిధిలో అనేక పాఠశాలలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదు. 10వ తరగతి విద్యార్థులకు మరీ ఇబ్బందిగా మారింది. ఇకనైనా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.