News October 11, 2025
గ్రేటర్ HYDలో 14,112 గుంతలు పూడ్చి వేసినట్లు ప్రకటన

గ్రేటర్ HYD వ్యాప్తంగా 16,541 గుంతలు ఉన్నాయని గుర్తించిన అధికారులు, ఇప్పటి వరకు రోడ్లపై 14,112 గుంతలు పూడ్చివేసినట్లుగా తెలిపారు. రోడ్డు సేఫ్టీ చర్యలు వేగంగా చేపడుతున్నట్లు GHMC వివరించింది. జోన్ల వారీగా ఎల్.బీ. నగర్ జోన్ 2,743, చార్మినార్ జోన్ 2,235, ఖైరతాబాద్ 1,987, శేరిలింగంపల్లి 1,576, కూకట్పల్లి 2,308, సికింద్రాబాద్ జోన్లో 3,263 గుంతలు పూడ్చినట్లు రిపోర్ట్ను విడుదల చేసింది.
Similar News
News October 11, 2025
175 వద్ద రనౌట్.. జైస్వాల్ ఏమన్నారంటే?

WIతో జరుగుతున్న 2వ టెస్టులో 175 రన్స్ వద్ద ఔటవ్వడంపై జైస్వాల్ స్పందించారు. ఇది ఆటలో భాగమేనని తెలిపారు. తానెప్పుడూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ గేమ్ను వీలైనంత ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తానన్నారు. బంతి మూవ్ అయిన టైంలో గంటసేపు క్రీజులో ఉండగలిగితే ఈజీగా రన్స్ చేయగలనని అనుకున్నట్లు వివరించారు. ఇప్పటికీ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని, మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నారు.
News October 11, 2025
MBNR: విషాదం.. చేపల వేటకు వెళ్లి అన్నదమ్ములు మృతి

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలీదుపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానిక చెక్ డ్యాం వద్ద చేపల వేటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన సుధాకర్, సాయిలు అనే అన్నదమ్ములు నీటిలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. ఇటీవలే తల్లి సంవత్సరీకానికి హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News October 11, 2025
వర్మ.. HYDకు రంజీ ‘తిలకం’ దిద్దు!

రంజీ ట్రోఫీ.. దేశంలో 90 సార్లు జరిగిన క్రికెట్ సంగ్రామం. ఈ దేశవాలీ క్రికెట్లో HYD జట్టు కేవలం 2 టైటిళ్లు మాత్రమే గెలిచింది. మరో మూడుసార్లు రన్నరప్గా నిలిచింది. నాలుగు దశబ్దాలుగా రంజీ ట్రోఫీని HYD కైవసం చేసుకోలేకపోయింది. OCT 15 నుంచి 2025-26 సీజన్ ప్రారంభంకానుంది. ఈసారి హైదరాబాద్ కెప్టెన్గా తిలక్ వర్మ ఉండడంతో అభిమానుల్లో హోప్స్ పెరిగాయి. ఈ సీజన్లోనైనా <<17955623>>విజయ తిలకం<<>> దిద్దాలని ఫ్యాన్స్ కోరిక.