News September 23, 2024

గ్రేటర్ HYDలో RTC బస్‌పాస్ REPORT

image

2024 ఆగస్టులో ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ మంత్లీ బస్‌పాస్‌ కొద్ది రోజుల్లోనే 750 మంది కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. రూ.1450 విలువైన ఈ పాస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ చెల్లుబాటు అవుతోంది. ప్రస్తుతం నగరంలో 10,000 మంది ఆర్డినరీ, 75,000 మంది మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ వినియోగిస్తున్నట్లుగా వెల్లడించారు.

Similar News

News March 10, 2026

దిల్‌సుఖ్‌నగర్‌లో ‘నిరుద్యోగుల మిలియన్ మార్చ్’

image

తెలంగాణ ఉద్యమాలకు నిలయమైన ఈ నేలపై మరోసారి నిరుద్యోగుల ఆగ్రహం ఉప్పొంగుతోంది. ఏడాదిలోపే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుస్సా మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇవాళ ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’కు పిలుపునిచ్చారు. ఉ. 10 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌కు భారీగా తరలిరావాలన్నారు.

News March 10, 2026

దిల్‌సుఖ్‌నగర్‌లో ‘నిరుద్యోగుల మిలియన్ మార్చ్’

image

తెలంగాణ ఉద్యమాలకు నిలయమైన ఈ నేలపై మరోసారి నిరుద్యోగుల ఆగ్రహం ఉప్పొంగుతోంది. ఏడాదిలోపే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుస్సా మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇవాళ ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’కు పిలుపునిచ్చారు. ఉ. 10 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌కు భారీగా తరలిరావాలన్నారు.

News March 10, 2026

HYD: గ్రేటర్‌లో గ్యాస్‌ మంట.. ఆరిపోతున్న పొయ్యిలు!

image

గ్రేటర్‌ HYDలో గ్యాస్‌ సెగ రేగుతోంది. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల సాకుతో వాణిజ్య సిలిండర్ల సరఫరాకు బ్రేక్‌ పడటంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. అమాంతం పెరిగిన ధరలకు తోడు.. రీఫిల్లింగ్‌ గడువును 25 రోజులకు పెంచడం వ్యాపారులకు శాపంగా మారింది. డొమెస్టిక్‌ సిలిండర్లకే మొగ్గు చూపుతుండటంతో వాణిజ్య అవసరాలకు కొరత ఏర్పడిందని హోటల్‌ యజమానులు విలవిలలాడుతున్నారు.