News October 10, 2024
గ్రేట్.. వలస కూలీగా వచ్చి కుమారుణ్ని టీచర్ చేసింది

వలస కూలీగా వచ్చిన మహిళ కష్టపడి కుమారుణ్ని టీచర్గా చేసింది. గ్రామస్థుల వివరాలిలా.. బట్టు లక్ష్మి కొన్నేళ్ల క్రితం రెడ్లకుంటకు వలస వచ్చింది. ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పనిచేసింది. కుమారుడు వెంకటేశ్వర్లుని కష్టపడి చదివించింది. డీఎస్సీ ఫలితాల్లో అతను సూర్యాపేట జిల్లా 11వ ర్యాంకు సాధించాడు. కొడుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దిన లక్ష్మి ఎందరో మాతృమూర్తులకు ఆదర్శప్రాయంగా నిలిచింది.
Similar News
News December 31, 2025
నల్గొండ: ‘ఆపరేషన్ చబుత్ర’తో పోలీసుల తనిఖీలు

నల్గొండ జిల్లాలో నేరాలు, రోడ్డు ప్రమాదాల అదుపునకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో చేపట్టిన ‘ఆపరేషన్ చబుత్ర’ సత్ఫలితాలనిస్తోంది. 30 బృందాలతో చేపట్టిన విస్తృత తనిఖీల్లో డ్రంకెన్ డ్రైవ్ కింద 337 కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 300 మంది యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. డిసెంబర్ 31 వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News December 31, 2025
నల్గొండ: ‘ఇలా’ వచ్చి.. ‘అలా తనదైన ముద్ర వేశారు’

14 నెలల పదవీకాలంలో కలెక్టర్గా ఇలా త్రిపాఠి జిల్లాలో తనదైన ముద్రవేశారు. 2024 అక్టోబరు 28న ఇలా త్రిపాఠి కలెక్టర్గా నియమితులయ్యారు. నిత్యం జిల్లాలో ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో మమేకమవడమే గాక పలు పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా విద్యాభివృద్ధి, మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల కోసం ఆమె ప్రత్యేకంగా కృషి చేశారు.
News December 31, 2025
NLG: రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు బదిలీ

నల్గొండ జిల్లాలోని రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. 2023 డిసెంబర్ నాటికి కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణణ్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మరుసటి నెలలోనే బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన హరిచందన, ఆ తర్వాత నియమించిన నారాయణరెడ్డి కూడా ఎక్కువ కాలం పని చేయలేదు. ఆయన స్థానంలో ఇలా త్రిపాఠి కలెక్టర్గా వచ్చిన సరిగ్గా 14 నెలల్లోనే ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది.


