News February 23, 2026
ఘట్కేసర్: సైబర్ మోసం.. కూలీ ఖాతా ఖాళీ!

కూలి చేసుకుంటూ పూటగడిపే వారి ఖాతాలపై కూడా కన్నేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. యాదాద్రి-భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల్లకు చెందిన బోదాసు విష్ణు (38) ఘట్కేసర్లోని తన సోదరి ఇంటికి వచ్చాడు. ఈ నెల 12న అతడి SBI ఖాతా నుంచి 3 విడతల్లో మొత్తం రూ.41,799 డెబిట్ అయ్యాయి. సైబర్ కేటుగాళ్ల చేతివాటమే అనుకుని, 1930కు ఫిర్యాదు చేయగా రూ.800 హోల్డ్లో పెట్టారు. ఘట్కేసర్ PSలో కంప్లైంట్ చేయడంతో కేసు నమోదైంది.
Similar News
News February 24, 2026
సింహాచలం ట్రస్ట్ బోర్డు… నిర్ణయం పెండింగ్? (1/1)

సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన దేవాలయాలకు బోర్డులు నియమిస్తున్న నేపథ్యంలో సింహాచలానికి కూడా 22 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జరిగింది. TTD తరహాలో ఇక్కడ కూడా చోటు కోసం TDP,జనసేన,BJP నేతలు ఇప్పటికే ఎదురు చూపులు చూస్తున్నారు.అశోక్ గజపతి నిర్ణయం వల్లన ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది.
News February 24, 2026
HYD: నేడు ఆర్టీసీ సంఘాల చలో సెక్రటేరియట్

నేడు ఆర్టీసీ సంఘాలు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోవడం, ఉద్యోగులపై పని ఒత్తిడి, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో నిరసన వ్యక్తం చేయనున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చయి.
News February 24, 2026
HYD: నేడు ఆర్టీసీ సంఘాల చలో సెక్రటేరియట్

నేడు ఆర్టీసీ సంఘాలు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోవడం, ఉద్యోగులపై పని ఒత్తిడి, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో నిరసన వ్యక్తం చేయనున్నాయి. దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చయి.


