News January 29, 2025
ఘనంగా శ్రీ సీతారాముల నిత్యకల్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రామయ్యకు ఘనంగా నిత్య కళ్యాణం నిర్వహించారు. స్వామి వారికి సుప్రభాతసేవ జరిపారు. అనంతరం ఆరాధన, నివేదన సేవాకాలం, నిత్యహోమాలు, నిత్య బలిహరణం నిర్వహించారు. తదుపరి స్వామి వారి కల్యాణమూర్తులకు కల్యాణతంతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేశ్ కుమార్, ఏసీపీలు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో పాటు వివిధ విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
News September 17, 2025
కొడంగల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కొడంగల్ నియోజకవర్గ తుంకిమెట్ల శివారులో ఘోర ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దౌల్తాబాద్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన కనకప్ప (26) అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్లో డ్రైవర్గా పని చేసే కనకప్ప రాత్రి స్వగ్రామానికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అన్న ఆశప్ప ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
News September 17, 2025
నటికి రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్?

హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హయ్యెస్ట్ బడ్జెట్తో రూపొందనున్న ఓ సినిమాలో నటించేందుకు ఆమెకు ఏకంగా రూ.530కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇది జరిగితే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా సిడ్నీ నిలువనున్నారు.