News February 25, 2025
ఘన్పూర్: సభను విజయవంతం చేయండి: మల్లు రవి

వచ్చే నెల 2న వనపర్తి కి సీఎం రేవంత్ రెడ్డి విచ్చేయుచున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తెలిపారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని రూ.500 కోట్లతో లోన్ మేళా, జాబ్ మేళా, స్కిల్ డెవలప్ మెంట్ మేళాలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Similar News
News February 25, 2025
విశాఖ: ‘నిర్ణీత సమయంలో ధ్రువపత్రాలు అందించాలి’

జనన, మరణ, కుల, వివాహ, ఆదాయ ధ్రువపత్రాలను నిర్ణీత సమయంలో అందించాలని జిల్లా న్యాయాధికారి సంస్థ సెక్రటరీ వెంకట శేషమ్మ పేర్కొన్నారు. జీవీఎంసీ జోన్ -4 కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సర్టిఫికెట్లు జారీ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంతో 6 నెలలకు ఒకసారి సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. మ్యారేజ్ ధృవపత్రాలు జారీ చేసేటప్పుడు వధూవరుల వయసు పరిగణలోకి తీసుకోవాలన్నారు.
News February 25, 2025
SRPT: గుండెపోటుతో వ్యక్తి మృతి

తుంగతుర్తిలో గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన కటకం వెంకన్న (55) కొన్ని సంవత్సరాలుగా బ్రిక్స్, వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో షెడ్డులో పని చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 25, 2025
శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు: SP

బుధవారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సకాలంలో దర్శనం చేసేలా చూడాలని సూచించారు. శివరాత్రి జాగారం సమయంలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.