News February 11, 2026
ఘోర ప్రమాదం.. ఆరుగురు యువకుల దుర్మరణం

రాజస్థాన్లోని జైపూర్-ఆగ్రా NHపై నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువకులు మరణించారు. పెళ్లికి హాజరై తిరిగి కారులో వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ను ఢీకొట్టారు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులు సమయ్ (25), లోకేశ్ (24), దిల్కుష్ (24), మనీశ్ (23), అంకిత్ (26), నవీన్ (23)గా గుర్తించారు. వారంతా మంచి మిత్రులంటూ కలాఖో గ్రామస్థులు కన్నీరుపెట్టుకున్నారు.
Similar News
News February 23, 2026
ఆ మోజే టీమ్ఇండియా కొంపముంచిందా?

SAతో మ్యాచ్లో భారత బ్యాటర్ల తీరు చూస్తే ఒక సమస్య కనిపించింది. అదే ‘డాట్ బాల్స్’. క్రీజులో పాతుకుపోయి స్ట్రైక్ రొటేట్ చేయడం కంటే ప్రతి బాల్ను బౌండరీకి పంపాలనే ఆరాటమే భారత్ను దెబ్బతీసినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. సింగిల్స్ తీస్తూ ప్రెజర్ తగ్గించుకోవాల్సింది పోయి వరుసగా డాట్ బాల్స్ ఆడటంతో ఒత్తిడి పెరిగి వికెట్లు పారేసుకున్నారు. కేవలం బౌండరీలపైనే ఆధారపడటం వల్ల మధ్యలో ఇన్నింగ్స్ మందగించింది.
News February 23, 2026
పాక్ వైమానిక దాడులపై భారత్ ఫైర్

అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోవడం దారుణమని విదేశీ వ్యవహారాల శాఖ మండిపడింది. తన దేశంలోని అంతర్గత వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
News February 23, 2026
ఇంట్లో నెమలి పెయింటింగ్ ఉంటే?

ఇంట్లో నెమలి పెయింటింగ్ ఉండటం చాలా మంచిదని పండితులు, వాస్తు నిపుణులు చెబుతున్నారు. ‘దానివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీనిని లివింగ్ రూమ్లో ఉంచితే కుటుంబసభ్యుల మధ్య ప్రేమ, అనుబంధాలు బలపడతాయి. నెమలి అందం ఇంటికి ఆకర్షణీయ రూపాన్నిస్తుంది. ప్రతికూల శక్తిని తొలగించి, ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతిమంగా సానుకూల మార్పులకు దారి తీస్తుంది’ అంటున్నారు.


