News March 23, 2025

ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

image

భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామ శివారులో ఖమ్మం-అశ్వారావుపేట NHపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా లారీ, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందగా, మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురెదురుగా ఢీకొన్న వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆరు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దమ్మపేట పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Similar News

News November 1, 2025

ఒకే ఇంట్లో ఆరుగురికి పింఛన్.. ₹36వేలు అందజేత

image

అనంతపురంలోని 26వ డివిజన్‌ హమాలీ కాలనీలో ఒకే ఇంట్లో ఆరుగురు దివ్యాంగులకు పింఛన్లు అందుతున్నాయి. సయ్యద్ కుటుంబంలోని ఆరుగురు (సయ్యద్, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, మనుమడు) మూగవారు కావడంతో, వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున పింఛను మంజూరు చేస్తోంది. శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారందరికీ పింఛన్లను అందజేశారు. రూ.36వేలు అందించారు.

News November 1, 2025

పలాసకే తలమానికంగా నిలిచిన గుడి ఇది!

image

కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వందలాది దేవతామూర్తుల విగ్రహాలతో <<18168511>>హరిముకుందా పండా అద్భుతంగా నిర్మించారు<<>>. తిరుమల శ్రీవారి విగ్రహంలా 9అడుగుల ఏకశిల విగ్రహాన్ని తిరుపతి నుంచే తెప్పించి ప్రతిష్ఠ చేశారు. పలాసకే ఈ గుడి తలమానికంగా నిలిచింది. దీంతో భక్తులు భారీగా ఆలయానికి వస్తుంటారు. హరిముకుంద ఒడియా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆలయంలో ప్రత్యేకతలు ఒడిశా సంప్రదాయానికి దగ్గరగా ఉంటాయి.

News November 1, 2025

GNSS కడప స్పెషల్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్

image

GNSS స్పెషల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన నీలమయ్య రిలీవ్ అయ్యాడు. ఆ స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్రన్‌ను అదనంగా స్పెషల్ కలెక్టర్‌గా కేటాయించారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఛాంబర్‌లో కడప స్పెషల్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్ బాధ్యతలను స్వీకరించారు.