News September 17, 2025

చందన్ వల్లి-కొడంగల్ రేడియల్ రోడ్డు: CM

image

ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో కొత్తగా రేడియల్ రోడ్లు వేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విస్తరణలో ప్రజలకు, రైతులకు నష్టం జరగకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం ఉంటుందని తెలిపారు. పరిశ్రమల కల్పవల్లి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్ వల్లి నుంచి కొడంగల్ వరకు 70 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు నిర్మాణం త్వరలో చేపడతామని ప్రజాపాలన వేడుకల్లో సీఎం వెల్లడించారు.

Similar News

News September 17, 2025

హస్తంలో చిచ్చుపెట్టిన జూబ్లీహిల్స్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హస్తం పార్టీలో చిచ్చు పెట్టింది. అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. పాత నేతలంతా టికెట్ కోసం హస్తిన నుంచి ఫైరవీ మొదలెట్టారు. దానం నాగేందర్‌, అంజన్ కుమార్, నవీన్ కుమార్, PJR కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీసీ నేతను పోటీకి దింపేందుకు INC నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు CM, TPCC చీఫ్ నిర్ణయమే కీలకంగా మారుతోంది.

News September 17, 2025

మహారాష్ట్ర క్లబ్‌లో తెలంగాణ జూదరులు

image

మహారాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ జూదానికి అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు పేకాట నిర్వహణపై ఉక్కుపాదం మోపడంతో వీరంతా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లాకు ఆనుకోని ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో ఇండోర్‌ క్లబ్‌ల పేరిట అనుమతులు తీసుకుంటూ నిర్వాహకులు పేకాట నిర్వహిస్తూ రూ.లక్షలు వెనుకేసుకుంటున్నారు. అక్కడ ఆడే వాళ్లంతా MNCL, ASF జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం.

News September 17, 2025

రేపు వెంకటపాలెంలో NTR విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం

image

రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పిస్తారని తాడికొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం తెలిపింది. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరతారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.