News March 22, 2025

చందుర్తి : అకాలవర్షంతో పంట నష్టం

image

అకాల వర్షం మండలవ్యాప్తంగా అపార నష్టాన్ని, కష్టాన్ని తెచ్చిపెట్టింది. శుక్రవారం సాయంత్రం కురిసిన బలమైన ఈదురుగాలులతో కూడిన వానకు పంటలు దెబ్బతిన్నాయి. చందుర్తి పాటు, మల్యాల, తిమ్మాపూర్, రామన్నపేట, నర్సింగాపూర్ గ్రామాల్లో సుమారు గంటపాటు కురిసిన వర్షానికి పలువురు రైతులకు చెందిన వరి పంట నేల రాలిపోయింది. పంట చేతికందే సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వానలకు నష్టపోవడంతో రైతులు కంటతడి పెట్టారు.

Similar News

News March 23, 2025

గేట్‌లో పంగులూరు విద్యార్థికి ఆలిండియా 81 ర్యాంకు

image

2025 సంవత్సరానికి సంబంధించి గేట్ పరీక్షలో పంగులూరు గ్రామానికి చెందిన పుత్తూరి లక్ష్మీ శ్రీ సాయి లోకేశ్‌కు ఆల్ ఇండియా స్థాయిలో 81వ ర్యాంకు వచ్చింది. సాయి లోకేశ్ ఏడో తరగతి వరకు ఒంగోలులో, పదో తరగతి వరకు చిలకలూరిపేటలో, పాలిటెక్నిక్‌ను ఒంగోలులోని దామచర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివాడు.

News March 23, 2025

ద్వారకాతిరుమల: కిడ్నాపర్‌కు సహకరించిన వ్యక్తి అరెస్ట్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ద్వారకాతిరుమల మండలానికి చెందిన బాలికను తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు 3 నెలల క్రితం కిడ్నాప్ చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో అప్పట్లో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడితోపాటు మరో ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేశారు. నిందితుడికి సహకరించిన తెలంగాణ రాష్ట్రం, కలిగోట్‌కు చెందిన సురేశ్‌ను శనివారం అరెస్ట్ చేశారు.

News March 23, 2025

28న చింతలూరు నూకాంబిక జాతర

image

ఆలమూరు మండలం చింతలూరులో కొలువైయున్న నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆలయ కమిటీ శనివారం తెలిపింది. 28వ తేదీ శుక్రవారం అమ్మవారి జాతర జరుగుతుందన్నారు. 29వ తేదీ శనివారం తీర్థం జరుగుతుందని చెప్పారు. 30వ తేదీ ఆదివారం ఉగాది ఉత్సవం నిర్వహిస్తామన్నారు. జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయం వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

error: Content is protected !!