News August 27, 2025

చందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ ఆకస్మిక తనిఖీ

image

చందుర్తి మండల పోలీస్ స్టేషన్‌ను వేములవాడ సబ్ డివిజన్ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. రాబోయే వినాయక నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో పూర్తి చేయాలని, అలాగే విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె ఆదేశించారు.

Similar News

News August 27, 2025

ఆ దేశాలతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు: ట్రంప్

image

యూకే, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్, దక్షిణ కొరియా, EU దేశాలతో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆయా దేశాలు బిలియన్ల డాలర్లు US ట్రెజరీకి చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. అటు భారత్‌పై ఇప్పటికే 25% టారిఫ్స్ ఉండగా అదనంగా విధించిన టారిఫ్స్ IST ప్రకారం ఇవాళ ఉ.9.31 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత ఎగుమతులపై టారిఫ్స్ 50శాతానికి చేరుతాయి.

News August 27, 2025

ప్రజా సమస్యలు మీడియా వెలికి తీయాలి: MP రఘునందన్

image

ప్రజా సమస్యలను మీడియా వెలికి తీసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మీడియా అవగాహన సదస్సులో అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలన్నారు. ఖచ్చితమైన సమాచారం సేకరించి వార్తలు రాయాలని సూచించారు.

News August 27, 2025

స్టే.ఘ: యూరియా కోసం షాప్‌ల ముందు రైతుల పడిగాపులు

image

మునిగినా, తేలినా భూమినే నమ్ముకునే రైతులు ఎకరం సాగు చేయాడానికి నానా అవస్థలు పడుతున్నారు. రైతులకు సాగు కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. సాగు నీటి సమస్య, కూలీల సమస్య, గిట్టుబాటు ధర సమస్యతో పాటు ప్రభుత్వం స్పందిస్తే పరిష్కారం అయ్యే యూరియా సమస్యతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. మంగళవారం స్టే.ఘ. మండల శివునిపల్లిలో ఉదయం ఫర్టిలైజర్ షాప్ తీయకముందే షాపు ముందు వర్షం పడుతున్నా రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాశారు.